గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ రాజకీయాలు ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాల మధ్య ఈ ఓటింగ్ పూర్తయ్యింది. మొత్తానికి ఓటింగ్ ఫలిగంగా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ వైదొలగాల్సి వచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. మొత్తం 174 మంది సభ్యుల ఓట్లు ఆయనకు వచ్చాయి.
గత కొన్ని రోజులుగా నేషనల్ అసెంబ్లీ సమావేశంలో రగడ కొనసాగుతూ వస్తూనే ఉంది.. ఈ క్రమంలో ప్రధానిని ఎన్నుకునే సమయంలో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తాను దొంగల సభలో ఉండలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీటీఐ సభ్యులంతా రాజీనామాలు చేస్తారని ఇమ్రాన్ తెలిపారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
మొత్తానికి నాటకీయ పరిణామాల మద్య 174 మంది సభ్యుల ఓట్లతో షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక షెహబాజ్ విషయానికి వస్తే.. ఆయన 1951 లాహోర్లో జన్మించారు. తండ్రి ముహమ్మద్ షరీఫ్ స్వస్థలం కశ్మీర్ (భారత్)లోని అనంతనాగ్. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునన్న ఆయన మూడు పర్యాయాలు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ కి సోదరుడు. ప్రస్తుతం షెహబాజ్ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఇది చదవండి: ముగిసిన జగన్ – బాలినేని భేటీ.. చివరకు ఏమైందంటే..?