చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. ఒకప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్లు, వారి జీవన విధానం ఎలా ఉండేదో అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టే చరిత్రకారులు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. గుప్తుంగా దాగి ఉన్న చరిత్రను, అందులోని రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పరిశోధనల ఫలితంగానే ఎన్నో విషయాలు బహిర్గతమయ్యాయి. అయినా, సరే పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా అన్ని దేశాలు హిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. అందులో సౌదీ అరేబియా కూడా ఉంది. తాజాగా ఓ విషయంలో సౌదీ సక్సెస్ కూడా అయింది.
2 వేల ఏళ్ల కింద మనుషులు ఎలా ఉండేవారో ఓ స్త్రీ ప్రతిమ ద్వారా చూపించారు. సౌదీ అరేబియా ద్వీపకల్పంలో ఒకప్పుడు నివసించిన నబటేయన్ ప్రజలు చూడటానికి ఎలా ఉండేవారో ఒక ప్రతిమ ద్వారా హిస్టేరియన్లు చూపించారు. సౌదీ అరేబియా, హెగ్రా అనే నగరంలోని ఓ శవపేటికలో దొరికిన అవశేషాలకు సాంకేతికత, కళాత్మకత జోడించి నబటేయన్ మహిళ మొహాన్ని చరిత్రకారులు తయారు చేశారు. దీని తయారీకి తాము చాలా కష్టపడ్డామని లైలా నెమే అనే ఆర్కియాలజిస్ట్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమె డైరెక్టర్గా వ్యవహరించారు.
ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాల ద్వారా అప్పట్లో మనుషుల జీవన విధానం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు ఆస్కారం లభించిందని లైలా నెమే చెప్పారు. అదే సమయంలో చనిపోయిన తర్వాత కూడా బతికుండాలనుకునే నబటేయన్ ప్రజల ఆలోచనా సరళిని అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని లైలా నెమే చెప్పారు. కాగా, యూకేకు చెందిన చరిత్రకారులు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రాయ్ కమిషన్ ఫర్ అలూలా ఆర్థిక సాయం చేసింది. 2 వేల ఏళ్ల నాటి ఈ నబటేటన్ మహిళ ప్రతిమను రూపొందించి కళ్లముందు ఉంచిన చరిత్రకారుల కృషిపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.