RHC Staff: పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రూరల్ ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ చేయటం కారణంగా ఓ పసి బిడ్డ లోకాన్ని చూడకుండానే కన్నుమూశాడు. ఆసుపత్రి సిబ్బంది చేసిన ఆపరేషన్లో బిడ్డ తల తెగింది. దీంతో తల్లి కడుపులోనే బిడ్డ కన్నుమూసింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్లోని తర్పార్కర్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల ఓ గర్భిణి ఆదివారం పురిటి నొప్పులతో అక్కడి రూరల్ హెల్త్ సెంటర్కు వెళ్లింది. ఆ సమయంలో కాన్పు చేయటానికి మహిళా గైనకాలజిస్ట్ కానీ, పెద్ద డాక్టర్లు కానీ లేరు. దీంతో ఆర్హెచ్సీ సిబ్బందే రంగంలోకి దిగారు. సదరు గర్భిణికి ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ సమయంలో పొరపాటున శిశువు తలను కోశారు. దీంతో బిడ్డ అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఆమె పరిస్థితి విషమించటంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి.. బిడ్డ మృతదేహం లోపల ఇరుక్కుపోయిందని గుర్తించారు. ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోని బిడ్డ దేహాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nobel Peace Prize: వేలంలో రూ.800 కోట్లు పలికిన నోబెల్ శాంతి బహుమతి!