గత కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం వలన భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. జరుగుతోంది. ఈనేపథ్యంలో ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా వేలాది మంది చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్థానికంగా ఉండే ప్రముఖులు తమవంత సాయం చేస్తున్నారు. తాజాగా రష్యన్ జర్నలిస్ట్ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత దిమిత్రి మురాతోవ్ చిన్నారులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తన నోబెల్ బహుమతిని వేలం వేశారు. నోబెల్ శాంతి బహుమతి వేలంలోరికార్డు సృష్టించింది. దిమిత్రి మురతోవ్.. తన నోబెల్ శాంతి బహుమతిని వేలం వేయగా.. కొన్నేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. ఈక్రమంలో నోబెల్ శాంతి బహుమతి 103 మిలియన్ డాలర్స్(సుమారు రూ.800 కోట్లు)కు అమ్ముడు పోయింది. గతంలో ఉన్న నోబెల్ వేలం రికార్డులు .. ఈ వేలంతో బద్దలయ్యాయి. 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని వేలం వేయగా 4.76 మిలియన్ డాలర్లు వచ్చాయి. అప్పట్లో అదే అత్యధికం. ఈసారి దిమిత్రి మురతోవ్ నోబెల్ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడైంది. ఈ నోబెల్ శాంతి బహుమతి వేలం వేయగావచ్చిన సొమ్మును ఉక్రెయిన్ చిన్నారులు సంక్షేమం కోసం ఖర్చుచేయనున్నారు. అక్టోబర్ 2021లో మురతోవ్.. పిలిప్పీన్స్ జర్నలిస్టు మారియా రీసాతో కలిసి ఈ నోబెల్ శాంతి అవార్డు అందుకున్నారు. ఇదీ చదవండి : Bride: ఇదెక్కడి విడ్డూరం.. పెళ్లి ఖర్చు 23 లక్ష... రష్యాలో స్వతంత్య్ర పత్రిక నొవాయా గెజిటాను ఆయన స్థాపించారు. ఎడిటర్ ఇన్ చీఫ్గా చేశారు. అయితే మార్చిలో ఆ పత్రికను మూసివేశారు. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్ము నేరుగా యునిసెఫ్ అకౌంట్లోకి వెళ్తుందని, ఆ సంస్థ ఉక్రెయిన్ పిల్లలకు ఖర్చు చేస్తుందని మురతోవ్ అన్నారు. మరి.. ఈ జర్నలిస్ట్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ర్ రూపంలో తెలియజేయండి.