ఎంతో మంది నిరుపేదలు బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకుని పరాయి దేశం వెళ్తారు. ఎన్నో ఆశలతో వెళ్లి వారికి కొందరు చేసే మోసంతో అక్కడ అష్టకష్టాలు పడుతుంటారు. జైలు జీవితం కన్నా దారుణంగా అక్కడి జీవితం ఉంటుందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఉన్నారు. అలా కువైట్ వెళ్లి వంట మనిషిగా చేరిన ఓ మహిళను అరబ్ షేక్ సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ మహిళ వారికి సరైన బుద్ధి చెప్పింది. మరి ఆ మహిళ చేసిన పనేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్కు చెందిన ఓ మహిళ కూడా కువైట్కు వెళ్లింది. ఓ ఇంట్లో వంటమనిషిగా పనిలో చేరింది. ముందు బాగానే పని చేసింది. ఇంట్లో వాళ్లకు కూడా ఆమె వంటకాలు భలేగా నచ్చాయి. కానీ రాను రాను టేస్ట్లో తేడా వచ్చింది. ఫుడ్లో ఏదో వాసన.. ఫ్రెష్గా వండినా కూడా తినాలని అనిపించేది కాదు. మరి టేస్ట్లో ఎందుకు మార్పు వచ్చిందని ఆ కుటుంబం ఆరా తీయడం మొదలు పెట్టింది.మొదట కిచన్ని శుబ్రం చేశారు. వంట కోసం కొత్తగా సామాన్లు కొన్నారు. అయినా సరే టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వలేదు. అప్పుడు యజమానులకు ఓ డౌట్ వచ్చింది. వంటమనిషే ఏదో చేస్తుంది అనుకున్నారు. ఆమెకు తెలియకుండా కిచెన్లో సీసీ కెమెరా ఫిక్స్ చేశారు. ఆతర్వాత ఇంకేముంది. అసలు నిజం బయట పడింది.
సీసీ కెమెరా గురించి తెలియక.. ఎప్పటిలాగే మురికి నీటిని ఉపయోగించి వంటలు చేసింది ఆ మహిళ. వీడియో చూసిన కువైట్ ఫామిలీ షాక్ అయ్యింది. ఏంటీ ఇన్ని రోజుల నుంచి మురికి నీటితో వండిన ఆహారాన్ని తింటున్నామా అని ఒకరి ముఖలు ఒకరు చూసుకున్నారు.ఘటనపై కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వంటమనిషిని.. ఎందుకు ఇలా చేశావ్ అని అడిగితే.. తనకు చాలా చిన్నగది ఇచ్చారని, ఎలుకలు కూడా తిరుగుతునే ఉంటాయని చెప్పింది.
ఆ ఇరుకు గదిలో పడుకోడానికి కూడా రావట్లోదని యజమానులకు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోవడం వల్లే ఇలా చేశానని చెప్పుకొచ్చింది.ఇక వంటమనిషికి ఇలా చేయడంతో.. ఆమెపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు కూడా నమోదు చేశారు. అలాగే క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ అబ్దీన్ అల్ అబిదిన్.. వంటమనిషిని వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు.మరి..ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.