ప్రపంచంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే విమాన ప్రయాణం చేయాల్సిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు సైతం చోటుచేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సాంకేతిక లోపంతోనో, పక్షులు ఢీ కొనడంతోనో, వాతావరణం సహకరించక పోవడంతోనో ఇలాంటి ప్రమాదాలు జరగడం మనకు తెలిసిందే. మరి ఇవేవీ జరగకుండా ఓ విమానం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ (ఈ ఏ) కు చెందిన బోయింగ్ 737 విమానం సుడాన్ నుంచి ఆడిస్ అబాబాకు ప్రయాణమైంది. అయితే కొద్ది సేపటి తర్వాత విమానాన్ని పైలట్లు ఆటో పైలట్ మోడ్ లో ఉంచారు. ఇంకేముంది ఇద్దరు చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. గమ్యస్థానం చేరుకున్నప్పటికీ విమానం దిగడానికి వీలుగా ఎత్తు తగ్గించలేదు పైలట్లు. ఇది గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే వారికి అలర్ట్ జారీ చేసింది. కానీ మంచి నిద్రలో ఉన్న ప్రబుద్ద పైలట్లు స్పందించలేదు.
ఈ క్రమంలో విమానం గమ్యస్థానం దాటింది. దాంతో ఆటో పైలట్ మోడ్ ఆగి అలారం మోగింది. అప్పుడు వారు ఉలిక్కిపడి లేచారు. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ఆడిస్ అబాబాలో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే 25 నిమిషాలు విమానం గాల్లోనే చక్కర్లు కొడుతూ తిరిగింది. ఇక్కడ మరో గగుర్పాటుకు గురిచేసే విషయం ఏంటంటే అప్పుడు విమానం 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. ప్రయాణికులు దిగిన తర్వతా 3 గంటలు విమానాన్ని తనిఖీ చేసి పంపించారు. మరి ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడిన పైలట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Deeply concerning incident at Africa’s largest airline — Ethiopian Airlines Boeing 737 #ET343 was still at cruising altitude of 37,000ft by the time it reached destination Addis Ababa
Why hadn’t it started to descend for landing? Both pilots were asleep. https://t.co/cPPMsVHIJD pic.twitter.com/RpnxsdtRBf
— Alex Macheras (@AlexInAir) August 18, 2022