చేపల వేట.. అంటే అందరికి సరదా. 15 ఏళ్ల జార్జ్ టిండేల్ తన 52 ఏళ్ల తండ్రి కెవిన్ సరదాగా ఇలాగే చేపల కోసం నదిలోకి వెళ్లారు. అయితే.. వారు అనుకున్న అన్ని చేపలు మాత్రం లభించలేదు. కానీ.., తాము నదిలోకి వేసుకెళ్లిన బోటుకి ఓ పెద్ద అయస్కాంతాన్ని కట్టి నదిలోకి వదిలారు. వారు ఒడ్డుకి చేరుకుని చూడగానే.. ఆ అయస్కాంతంకి ఓ పెద్ద బాక్స్ తగులుకుని ఉంది. తండ్రి కెవిన్ కి అది కేవలం ఐరన్ బాక్స్ మాత్రమే కాదు, దాని నిండా నిధి ఉందని అర్ధమైంది. ఆ బాక్స్ 22 సంవత్సరాల క్రితంది అయినా.. చాలా గట్టిగా ఉండటంతో తండ్రీకొడుకులు ఇద్దరు చాలా కష్టపడి ఆ బాక్స్ ని బ్రేక్ చేశారు.
అంతే.. ఆ బాక్స్ ఓపెన్ అవ్వగానే దాని నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి.మొత్తం లక్షా ముప్పై వేలకు పైగా డాలర్లు ఉన్నాయి.అనుకోకుండా కలిగిన ఈ అదృష్టానికి తండ్రీకొడుకులు ఇద్దరు చాలా ఆనందపడ్డారు. కానీ.., ఆ బాక్స్ లోనే వారికి రాబ్ ఎవరెట్ అనే వ్యాపారవేత్తకు చెందిన విజిటింగ్ కార్డు కూడా లభించంది. అంటే.. ఈ డబ్బు అంతా ఆయనదే అని వీరికి అర్ధమైంది. వెంటనే జార్జ్, అతని తండ్రి కెవిన్ డబ్బును తమ వద్ద ఉంచుకోకుండా దాని యజమానికి మొత్తం డబ్బుని అందజేశారు. అదృష్టం కలసి వచ్చి లక్షలు దొరికినా.. ఆ డబ్బు మొత్తాన్ని నిజాయతీగా తిరిగి ఇచ్చేసినందుకు అంతా ఆ తండ్రీకొడుకుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక.. ఆ బాక్స్ యజమాని కూడా ఈ ఘటనపై స్పందించాడు.“2000 సంవత్సరంలో మా కార్యాలయంలో దొంగతనం జరిగింది. అక్కడ నుంచి ఈ సేఫ్ మాయమైంది, కానీ.., 22 ఏళ్ల తర్వాత నా డబ్బు తిరిగి నా దగ్గరికి వస్తుందని ఊహించలేకపొయాను. దీని అంతటికి కారణం జార్జ్, కెవిన్ నిజాయితీనే” అని రాబ్ ఎవరెట్ మెచ్చుకున్నాడు. తనకి అందిన సొమ్ములో నుండి ఆ తండ్రీకొడుకులకి కొంత అమౌంట్ ఇవ్వడానికి రాబ్ ఎవరెట్ ముందుకి వచ్చాడు ఏదేమైనా 22 ఏళ్ల క్రితం ఇలా దొంగిలించిన వస్తువులు లభించడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తాయనడంలో సందేహం లేదు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.