సాధారణంగా మనం ఎంతో ఇష్టంగా ఏదైనా వస్తువుని కొన్నప్పటికీ.. దాన్ని కొంత కాలం తర్వాత పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే దాన్ని చూసి చూసి బోర్ కొడుతుందని అంటుంటారు. కానీ ఓ వ్యక్తికి బోర్ కొట్టిందని ఓ బొమ్మను పాడు చేసాడు. ఏం చేయాలో తోచక ఖాళీగా ఉంటూ ఒక పెన్ తీసుకుని ఆ పెయింటింగ్ పైన కళ్ళు గీసాడు. తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు ఎంత పొరపాటు చేశాడో.. దాని వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలిసి అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ట్రెటియాకోవ్ గ్యాలరీ కలెక్షన్ లో ఉండే త్రీ ఫిగర్స్ అనే పెయింటింగ్ ని ప్రదర్శన లో వేలాడదీశారు. ఈ పెయింటింగ్ ని పశ్చిమ-మధ్య రష్యాలోని స్వర్డ్లోవ్స్క్ ఓబ్లాస్ట్ ప్రాంతంలోని యెల్ట్సిన్ సెంటర్లో హ్యాంగ్ చేయడం జరిగింది. ఆ బొమ్మ చూసి 60 ఏళ్ల సెక్యూరిటీ గార్డు కి ఏమనిపించిందో కానీ.. పెయింటింగ్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు ముఖాలపై బాల్ పాయింట్ పెన్ తో కళ్ళని గీసాడు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు లబో దిబో అన్నారు. ఆ పని చేసినందుకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు.
ఈ పెయింటింగ్ ని డిసెంబర్ 7 2021న ‘ది వరల్డ్ యాజ్ నాన్-ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఎ న్యూ ఆర్ట్’ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడింది. అయితే పోలీసులు ఆరా తీశారు. ఈ వ్యక్తికి రూ. 39,900 జరిమానాతో పాటుగా ఒక సంవత్సరం సవరణ కార్మిక శిక్ష వేశారు. పెయింటింగ్కు జరిగిన నష్టం రూ. 2,49,500గా అంచనా వేశారు. అయితే దీనిని గతంలో ఎలా ఉందొ అలా మార్చచ్చని ఎలాంటి సమస్య లేదు అని యెల్ట్సిన్ సెంటర్ ఇన్స్పెక్ట్ చేసి మాస్కో కి కూడా పంపింది. మళ్ళీ పెయింటింగ్ రూపుని తీసుకు రావడానికి నిపుణులు కృషి చేస్తున్నారు.