కొంతమంది చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటారు.. ముఖ్యంగా దొంగతనం విషయంలో తాము చేయలేదని చెప్పినా వారిపై దాడులు చేస్తుంటారు. తీరా నిజం తెలిసిన తర్వాత అయ్యో పాపం అంటుంటారు.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. దొంగతనం చేశాడని అనుమానంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపారు. స్థానికంగా ఈ విషయం పెను సంచలనంగా మారింది. ఈ ఘటన బోజర్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
బీహార్ లో టోల్ ప్లాజా లో గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై కొంతమంది దుండగులు అతి దారుణంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ గార్డు చికిత్స పొందుతూ చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. భోజ్పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్ ప్లాజా లో గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఆదివారం సాయంత్రం కొంతమంది దుండగులు 50 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో కొట్టి చంపారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్ గా గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బల్వంత్ సింగ్ తన స్వగ్రానికి వెళ్లాడు.
ఇటీవల రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషన్ కి అనుకూలంగా ఆ వ్యక్తి మాట్లాడినందుకు హర్యానాకు చెందిన కొంతమంది బౌన్సర్లు ఈ దాడికి పాల్పపడి ఉండవొచ్చని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుల్హదియా టోల్ ప్లాజా గార్డుగా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ పై కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అక్కడి సిబ్బంది అతడిని ట్రైన్ లో సొంతూరికి పంపించారని.. రైలులో ఆరోగ్యం క్షిణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్ వద్ద దింపి రైల్వే పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారని.. చికిత్స పొందుతూ బల్వంత్ సింగ్ మరణించాడని గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని నింధితుల కోసం గాలిస్తున్నామని అన్నారు.