పెను విషాదం నెలకొంది. పడవ బోల్తా పడి 103 మంది మృతి చెందారు. వివాహ వేడుకకు హాజరై పడవలో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
పెను విషాదం నెలకొంది. పెళ్లి అతిథులతో వెళ్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 103 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. రహదారిని వరద ముంచెత్తడంతో వేరే దారి లేక పడవ మీద ప్రయాణం చేశారు. లేదంటే వారి సొంత వాహనాల మీద ప్రయాణం చేసేవారు. వరద కారణంగా 100 మందికి పైగా మృతి చెందారు. వంద మందికి పైగా నీట మునిగారు. వీరి కోసం స్థానికులు, అధికారులు వెతుకుతున్నారు. ఈ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. ఉత్తర నైజీరియాలో పెళ్లి వేడుకకు హాజరైన ప్రయాణికులు పడవలో తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 103 మంది మృతి చెందారు.
క్వారా రాష్ట్రంలోని ఇలోరిన్ నుంచి భారీ ప్రయాణికులతో బయలుదేరిన పడవ.. పతేగి జిల్లా నైజర్ నదిలో 160 కి.మీ. వేగంతో వెళ్తుండగా బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 300 మంది ఉన్నారు. బరువు అతిగా ఉండడం వల్లే పడవ అదుపు తప్పిందని అంటున్నారు. ఇప్పటి వరకూ 100 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారిని ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ప్రమాదంలో మునిగిన వారంతా పలు గ్రామాలకు నుంచి పెళ్ళికి వచ్చిన బంధువులని.. వివాహ వేడుకకు కలిసి వచ్చారని, రాత్రి పార్టీలో పాల్గొన్నారని స్థానిక అధికారి అబ్దుల్ గనా లుక్పడా వెల్లడించారు.
వీరంతా మోటార్ సైకిళ్లపై వివాహ వేడుకకు హాజరయ్యారని.. అయితే వరద కారణంగా రోడ్లు నీట మునగడంతో స్థానికంగా తయారు చేసిన పడవలో బయలుదేరారు అని వెల్లడించారు. 300 మంది దాకా ఎక్కడంతో పడవ ఓవర్ లోడ్ అయ్యిందని, నది లోపల ఉన్న దుంగను ఢీకొనడంతో పడవ బోల్తా పడి రెండుగా విడిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. చాలా ఏళ్ల తర్వాత తాము చూసిన ఘోర ప్రమాదం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం మృతదేహాలను వెలికితీసిన అధికారులు స్థానిక ఆచారాల ప్రకారం నది దగ్గరే ఖననం చేశారు.