జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి కోర్టు రూ. 154 కోట్ల జరిమానా విధించింది. ఆ కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయి. వాడు తయారు చేసే ఉత్పత్తితో ప్రాణ హాని ఉందని ఆరోపించారు.
చంటి పిల్లల చర్మం చాలా మృదువుగా ఉంటుంది. పిల్లలు పెరుగుతుంటే వారి చర్మం కాంతింతంగా కొనసాగడానికి, చెమట నుండి రక్షణ కోసం బేబీ టాల్కమ్ పౌడర్ వాడుతుంటారు. ఈ పౌడర్లు అనేక బ్రాండ్లతో మార్కెట్లో అమ్ముడవుతుంటాయి. కానీ అవి చిన్న పిల్లల చర్మానికి ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. మార్కెట్లోకి వస్తున్న ప్రతి వస్తువులు కల్తీతో వస్తున్నాయి. వాటితో ప్రాణ హాని పొంచిఉంది. ఇలాంటి విషయాలు బయటపడ్డప్పుడైనా ప్రజలు అప్రమత్తం కావలసిన అవసరం ఉంది. తాజాగా ఓ ప్రముఖ బేబీ పౌడర్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 154 కోట్ల జరిమానా విధించింది. ఆ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం..
గ్లోబల్ బ్రాండ్ కంపెనీ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పేరు వినని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ ప్రజాదరణ పొందింది. మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఈ సంస్థ ఉత్పత్తులపై అనుమానాలు వ్యక్తపరిచాయి. అయితే ఈ ప్రముఖ కంపెనీకి అమెరికా కోర్టు రూ. 154 కోట్ల జరిమానా విధించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాలు ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీని ఆదేశించాయి. కొన్ని సాంపుల్స్ మానవ శరీరానికి హానికరమని ఆరోపించారు. అప్పట్లో అమ్మకాలు పడిపోతున్నాయని ఆ కంపెనీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి తొలగించారు.
ఈ సంస్థ నుండి ఉత్పత్తి అయిన పౌడర్ కారణంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఆంథోనీ హెర్నాండెజ్ వాలాడెజ్ అనే వ్యక్తి ఈ ఆరోపణతో కోర్టుకు వెళ్లాడు. ఈ వ్యక్తి ప్రకారం.. అతను చిన్నప్పటి నుండి ఈ కంపెనీ బేబీ పౌడర్ ను వాడుతున్నాడు. ఆ తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. టాల్కమ్ పౌడర్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని ఆ వ్యక్తి కేసు వేశాడు. ఈ పౌడర్ ఎక్కువ కాలం వాడడం వల్ల చెస్ట్ దగ్గర మెసోథెలియోమా అనే క్యాన్సర్ వచ్చిందని కోర్టుకు విన్నవించాడు. జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఉత్పత్తి పూర్తిగా సురక్షితమైందని కంపెనీ కోర్టుకు చెప్పుకుంది. టాల్కమ్ పౌడర్ ప్రత్యేకంగా గాలి కూడా చొరబడని కంటైనర్ లో ప్యాక్ చేసి ఉంటుందని.. ఉత్పత్తి సురక్షితమైనదని.. వినియోగానికి తగినదేనని కంపెనీ పేర్కొంది. ఆంథోనీ హెర్నాండెజ్ వాలాడెజ్ గత రెండేళ్లుగా కేసు వేసి కంపెనీతో పోరాడుతున్నాడు. దాని కోసం అనేక రుజువులు కూడా సమర్పింపచాడు. విచారణ అనంతరం కోర్టు కంపెనీకి రూ. 154 కోట్ల జరిమానా ఈ మొత్తాన్ని బాధితుడు, పిటిషనర్కు చెల్లించాలని ఆదేశించింది.