ఏ ప్రభుత్వం అయినా లేదా సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలి అంటే అందులో ఉద్యోగులది కీలక పాత్ర. వారు సంస్థను తమ సొంతం అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతోంది. ఇక కంపెనీ కూడా తన ఉద్యోగుల కష్టనష్టాలను కూడా చూసుకుంటేనే సంస్థపై వారికి నమ్మకం పెరిగి తమ శక్తి సామర్థ్యాల మేరకు పని చేసి కంపెనీ లాభాలకు దోహద పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఓ యజమాని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ద్రవ్యోల్భణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక భారతదేశం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వంటింటిలో ధరల మంటలు మండుతూనే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో కరెంట్ బిల్లులు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఓ కంపెనీ యజమాని తన సహృదయాన్ని చాటుకున్నాడు.
కరెంట్ బిల్లులు కట్టుకునేందుకు నెల నెలా బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వార్త వ్యాపార ప్రపంచంలో సంచలనంగా మారింది. 4కామ్ సంస్థ.. యూకే ఫోన్స్ సిస్టమ్ కంపెనీ MD డారన్ హట్ తన సంస్థలో పనిచేసే 431 మంది ఉద్యోగులకు బోనస్ ప్రకటించాడు. ప్రస్తుతం యూకేలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయి. అదీ కాక రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కంపెనీ ఉద్యోగులకు నెల నెల 200పౌండ్లు అంటే మన కరెన్సిలో దాదాపు రూ. 18,800 అన్న మాట. ఈ డబ్బులు ప్రతీ నెలా జీతంలో జమ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ ప్రకటన వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందని డారెన్ హట్ చెప్పారు. కష్ట కాలాల్లో ఉద్యోగులకు అండగా నిలిచిన ఈ యజమానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
4Com is pleased to announce a new Energy Support Bonus for all its staff! Starting immediately, employees will receive an additional £200 per month in their payslips until further notice. Read more on our blog: https://t.co/oCJyN3J5x9 pic.twitter.com/scwKmt24Mr
— 4Com (@4Complc) August 15, 2022