ప్రజా పథకాలను లబ్దిదారులకు అందించేందుకు విశేష కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా సమీక్షలు జరిపి.. తదుపరి నెలల్లో జరగాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన పథకాలపై చర్చలు జరుపుతుంది అధికార వర్గం.
ప్రజా పథకాలను లబ్దిదారులకు అందించేందుకు విశేష కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా సమీక్షలు జరిపి.. తదుపరి నెలల్లో జరగాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన పథకాలపై చర్చలు జరుపుతుంది అధికార వర్గం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పలు దఫాలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది. అమ్మఒడి, విద్యా దీవెన, వాహన మిత్ర, జగనన్న తోడు పథకం, వసతి దీవెన, చేయూత పథకం, కాపునేస్తం వంటి వాటిని అమలుచేస్తూ వస్తుంది. అలాగే ఎన్నికల ముందు స్వయం సహాయక బృందాల్లోని(డ్వాక్రా) అక్కా చెల్లెళ్లకు ఇచ్చిన వడ్డీ మాఫీ పథకం.. సున్నా వడ్డీని అందిస్తోంది. ఇది కూడా విడతల వారీగా మాఫీ చేస్తోంది. తాజాగా చేపట్టిన సమీక్షలో దీనిపై కూడా చర్చలు జరిగాయి.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ రాజ్, గ్రామాభివృద్ధి శాఖలపై చర్చించిన ఆయన.. గ్రామాల్లో సమ్రగ సర్వేపై దృష్టి సారించాలని ఆదేశించారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. తొలి విడత డబ్బులు అందుకున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తే వారికి పూర్తి స్థాయిలో వారికి లబ్ది చేరుతుందని తెలిపారు. అర్బన్, గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తెలిపారు.
అదే సమయంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త కూడా ఒకటి బయటకు వచ్చింది. సున్నా వడ్డీ పథకం కార్యక్రమం గురించి కూడా సమావేశంలో చర్చించారు. వచ్చే నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ లెక్క ప్రకారం ఎవరైతే ఈ సున్నా వడ్డీ పథకానికి అర్హులో..వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఆగస్టు 10 నుండి సున్నా వడ్డీ నగదు వారి ఖాతాల్లో పడనున్నాయి. ఇక మంగళవారం విశాఖలో సీఎం జగన్ పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు.