కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలకు పిలుపు అందింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీలో కీలక పరిణామాలు తీసుకొచ్చే విధంగా చర్చలు జరిపేందుకు భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింత రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు వంటి నేతలు రాహుల్ గాంధీతో నేడు సమావేశమవనున్నారు.
ముఖ్యంగా వీరి భేటీ రాష్ట్రంలో పార్టీ ఉనిఖిని పెంచుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరి దీనంగా మారింది. ఇక రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో గెలుపు ఓటములు బెరీజు వేసుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక వీరి భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చడాలి మరి.