వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ముద్ర ఎవ్వరూ చెరపలేనిది. రైతు పక్షపాతిగా, పెద ప్రజల నాయకుడిగా ఆయన మంచి మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోగలిగారు. మూడు పదులకి పైగా సాగిన రాజకీయ ప్రస్థానంలో వైఎస్సార్ చేయని పోరాటం లేదు. సాధించని విజయం లేదు. అనుభవించని పదువులు లేవు. అయితే.., కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా వైఎస్సార్ కి తోడుగా నిలిచిన వ్యక్తి ఎవరంటే ఆయన ఆత్మ కెవిపి పేరు ముందుగా వినిపిస్తోంది.
కెవిపి రామచంద్రరావుగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఎంత పేరు తెచ్చకున్నారో, వైఎస్సార్ ఆత్మగా అంతకు మించిన గౌరవాన్ని దక్కించుకున్నారు. అయితే.., వై.ఎస్ మరణం తరువాత కెవిపి ఆయన కుటుంబానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు ఆయన మనసులోనే ఉండిపోయాయి. అయితే.. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్.. “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” కార్యక్రమంలో కెవిపి మొదటిసారి కొన్ని విషయాలపై మౌనం వీడి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆయన 2004కి ముందు వైఎస్సార్ పడ్డ ఆర్ధిక ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. “వైఎస్సార్ 1983 నుండి అపోజిషన్ లోనే ఉంటూ వచ్చారు. ఆ సమయంలో ఆయన యన్టీఆర్ అంతటి నాయకుడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మా పార్టీలోనే అసమ్మతి వర్గం ఎక్కువ. వాళ్ళందరిని దాటుకుని.., 23 సంవత్సరాల పాటు ఎక్కడా రాజీ పడకుండా, తగ్గకుండా రాజశేఖర్ రెడ్డి పోరాడారు. పైగా.., కడప రాజకీయాలు చాలా కాస్ట్లీ. ఈ ప్రాసెస్ లోనే వైఎస్సార్ ఆస్తులన్నీ కరిగిపోయాయి. సరిగ్గా.. ఆ సమయంలోనే మైనింగ్ చేయాకుండా జీవో జారీ చేశారు. ఉన్న ఆ ఒక్క ఆదాయ మార్గం కూడా పోయింది. అలా.. వైఎస్సార్ 2004 ఎన్నికల ముందు ఆర్ధిక కష్టాలు పడ్డ మాట వాస్తవమే” నని కెవిపి తెలియచేశారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, వైఎస్సార్ సీఎం అవ్వడం, సరిగ్గా.. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ మోహన్ రెడ్డి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం చకచకా జరిగిపోయాయి. అక్కడ నుండి రాజశేఖర్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. తన మిత్రుడు పడ్డ కష్టాలను.. మళ్ళీ ఇన్నాళ్ళకి కెవిపి గుర్తు చేసుకోవడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి.. మీరు కూడా ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.