హైదరాబాద్- హైదరాబాద్ వేధికగా 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. వర్చువల్ విధఆనంలో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్ గెట్స్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని బిల్గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా వైరస్ మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. కరోనా వల్ల గత రెండేళ్లలో ప్రపంచం చాలా నష్టపోయిందని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని బిల్ గెట్స్ చెప్పారు. ఐతే కరోనా అనుభవం ప్రపంచానికి చాలా ఉపయోగపడనుందని ఆయన అన్నారు.
రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అందుకు స్పందించిన బిల్ గేట్స్.. వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మనిషి సాధించిన ఘనత అని చెప్పారు. అంతే కాకుండా ఆక్సిజన్ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామని అన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్ టీకాలను వేగంగా తయారు చేసిందని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిందని బిల్ గెట్స్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా హైదరాబాద్కు మళ్లీ ఎప్పుడు వస్తారని బిల్ గెట్స్ ను ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇంతకు ముందు హైదరాబాద్ ఓ సారి వచ్చానని గుర్తు చేసుకున్న గెట్స్, అక్కడికి మరోసారి రావాలని ఆసక్తిగా ఉందన్నారు. ఐతే కొన్నేళ్ల నుంచి దూర ప్రయాణాలు చేయడం లేదని ఆయన అన్నారు. కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని కేటీఆర్ తో చెప్పారు బిల్ గెట్స్.