గాజువాక- విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగి బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ బ్యాటరీ చార్జింగ్ లో ఉండగా ఈ ప్రమాదం సంబంవించిందని నిర్వాహకులు చెబుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని పంతులుగారి మేడ వద్ద గల సింహాద్రి ఆటో ఏజెన్సీ హీరో షోరూంలో మంగళవారం ఈ అగ్నిప్రమాదం జరిగడంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
బైక్ షోరూంలో అగ్ని ప్రమాద ఘటనకు సంబందించిన సమాచారం అందుకున్నవెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఐతే అప్పటికే 15 కొత్త బైకులు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు షోరూం యజమాని సింహద్రి చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఐతే ఈ అగ్ని ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బైక్ షోరూమ్ మూసివేసి ఉందని సిబ్బంది చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పగటి సమయంలో బైక్ షోరూంను ఎందుకు మూసేయాల్సి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
షోరూమ్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోమంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బైక్ షోరూం అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రామ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని గాజువాక పోలీసులు తెలిపారు.