బుల్లితెర డెస్క్- తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ మరోసారి సందడి చేయబోతోంది. దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ షోకు మంచి క్రేజ్ ఉంది. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో బిగ్బాస్ షోకు మంచి ఆధరణ ఉంది. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకోగా, ఆదివారం 5వ సీజన్ మొదలవుతోంది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కోసం రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కాబోతోంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ షోలో ఎవరెవరు ఉన్నారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గత కొన్ని రోజులుపుగా రకరకాల ప్రచారాలు జరుగుతుండగా, తాజాగా ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ బయటికి వచ్చింది. ఇప్పటికే వచ్చేసిన బిగ్ బాస్ ప్రోమో అందరిలో ఆసక్తి రేపుతోంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 షోలోకి ఎవరు వెళ్తున్నారో తెలుసుకుందామా..
ఆదివారం సెప్టెంబర్ 5న బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుండటంతో, ఒక రోజు ముందుగానే అంటే శనివారమే కంటెస్టెంట్లను హౌస్లోకి పంపారు నిర్వహకులు. గత కొన్ని రోజులుగా తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారంటైన్లో ఉన్న కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రవేశపెట్టారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5ని హోస్ట్ చేస్తున్న కింగ్ నాగార్జున సైతం బిగ్ బాస్ హౌజ్ కు చేరుకున్నారు.
ఇక సెప్టెంబర్ 5న ఆదివారం సాయంత్రం బిగ్బాస్ మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేదానిపై కూడా స్పష్టత వచ్చేసింది. బిగ్బాస్ హౌస్లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ లోబో, యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి, నటుడు విశ్వ, సింగర్ శ్రీరామచంద్ర హౌజ్ లోకి వెళ్తున్నారు.