చత్తీస్ ఘడ్- హత్యలు.. అత్యాచారాలు.. ఇవి ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ఇక కుటుంబాల్లో సైతం హింస పెరిగిపోయింది. అందులోను వరకట్న వేధింపులు, అక్రమ సంబాంధాలు పెట్రేగిపోతున్నాయి. అత్తారింట్లో కోడలిపై సాధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా వెళ్లినా ఆడపిల్లలపై అత్తారింటి ఆరళ్లు మాత్రం ఆగడం లేదు.
తాజాగా కోడలు గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడింజన్న కారణంతో అత్తింటివారు త కోడలును చెట్టుకు కట్టేసి కొట్టారు. అత్తా, మామల చిత్రహింసలు భరించలేక ఏడుస్తూ, వదిలిపెట్టమని ఎంత బతిమాలినా వారి మనసు మాత్రం కరగలేదు. అత్తా మామలతో పాటు ఇంట్లో వాళ్లంతా దారుణంగా దాడిచేస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన రాంపూర్ లోని బిలాస్పూర్ లో చోటు చేసుకుంది. ఈ నెల 17న జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ అపరిచిత వ్యక్తి బిలాస్పూర్కు వస్తుండగా దారిలో బాధితురాలిని చూసి మాటలు కలిపాడు. వీరు మాట్లాడుకుంటుండగా చూసిన స్థానికుడు ఒకరు ఆమె అత్తమామలకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు రావడంతో భయపడిన అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకేముంది ఆగ్రహం వ్యక్తం చేసిన అత్తామామలు మహిళను లాక్కొచ్చి చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత అతనితో మాట్లాడినందుకు గాను విచక్షణారహింతగా కొట్టారు.
మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చెట్టుకు వేలాడతున్న మహిళపై అత్తమామలు, కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. దెబ్బలకు తట్టుకోలేక బాధతో విలవిల్లాడుతూ రోదిస్తున్న బాధిత మహిళ క్షమించి తనను విడిచిపెట్టాలని కాళ్లా వేళ్లా పడ్డా వారు మాత్రం విడిచిపెట్టాలేదు. ఈ వీడియో చూసిన పోలీసులు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు.