తూర్పుగోదావరి- దెయ్యాలకు సంబంధించిన వార్తలంటే చాలామందికి అమితాసక్తి. అసలు దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే సంగతి వదిలిస్తే.. ఇందుకు సంబంధించి నెట్టింట్లో బొలేడు వీడియోలు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలోని ఓ నగల దుకాణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. షాపులోని సీసీటీవీ కెమరాలో.. ఏవో వింత ఆకారాలు.. గొడవ పడుతున్నట్లు రికార్డయ్యింది.
ఇది కూడా చదవండి : ఆ ఊరిని వణికిస్తున్న దెయ్యం! వారంతా వరుసగా చనిపోయారు!
వీడియోని చూసిన వారికి.. అక్కడ ఎవరో నిల్చుని దేని గురించో తీవ్రంగా వాదులాడుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. వీడియోలో మనుషులు కాకుండా వింత ఆకారాలు దర్శనమిచ్చాయి. తెల్లగా ఉన్న కొన్ని వింత ఆకారాలు చేయి పైకెత్తి ఎవరినో తిడుతున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది.
ఇది కూడా చదవండి : గూగుల్ మ్యాప్స్ లో దెయ్యం? వైరల్ వీడియో!
నగల దుకాణంలోంచి శబ్దాలు వినిపిస్తున్నాయని.. దొంగలు పడ్డారేమోననే అనుమానంతో షాపు యజమానికి సమాచారం ఇచ్చారు చుట్టుపక్కల వారు. ఇది విన్న వెంటనే యజమాని షాపు వద్దకు పరిగెత్తి లోపలికెళ్లి చూడగా.. అక్కడ వారికి ఎవరు కనిపించలేదు. ఇక సీసీటీవీ కెమరా పరిశీలించి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వింత ఆకారాలేవో.. గొడవపడుతున్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ఇది కాస్త బయటకు తెలియడంతో.. నగల దుకాణంలో దెయ్యాలు ప్రవేశించి.. గొడవపడుతున్నాయనే వార్త దావనంలా వ్యాపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.