ఫిల్మ్ డెస్క్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జిల్ ఫేం రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన రాధే శ్యామ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాకు సంబందించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింమ్స్, పాటలు అన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇక వచ్చే యేడాది సంక్రాతి పంగడగ బరిలోకి రాధే శ్యామ్ దిగబోతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రోషన్స్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు గురువారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులే ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు.
ఇక ఇలాంటి ప్రీ లిరీజ్ ఈవెంట్లకు సాధారణంగా ప్రముక యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరిస్తుంటారు. మామూలుగా స్టార్ హీరోల ఈవెంట్లు అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. ఐతే ఇప్పుడు మొదటి సారిగా సుమను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక హోస్ట్స్ గా జాతి రత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి, యాంకర్ రష్మీల పేర్లు తెరపైకి వచ్చాయి.
ప్రభాస్ రాధే శ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మీ మెరవబోతోందనే వార్త ఆమె అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అభిమానులు తమ మీద కురిపిస్తున్న ప్రేమకు రష్మీ ఫిదా అవుతున్నారు. మీరు ఇస్తున్న ఈ పాజిటివ్ వైబ్స్కు థ్యాంక్స్.. రాధే శ్యామ్ ఈవెంట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. అని రష్మీ తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు.
ఇక ఈ రోజు ప్రభాస్ అభిమానులకు పండుగే అని చెప్పాలి. అభిమానుల సమక్షంలోనే రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఆ ట్రైలర్ 24 గంటల్లో ఎన్ని వ్యూస్, లైక్స్ కొల్లగొడుతుందోనని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.