వెండితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న నటీనటులు పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో కామన్. ఇప్పటికే పలు జంటలు వివాహం చేసుకున్నాయి. అయితే కొన్ని జంటలు అనివార్యకారణాలతో విడిపోయాయి. అటువంటి జంటల్లో సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్యలున్నారు. వీరి విడాకుల విషయం ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. అంతలోనే మరో జంట డైవర్స్ తీసుకోబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటికి ఇప్పుడు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇంతకూ ఆ జంట ఎవరంటే..?
సినిమా నటీనటులు పెళ్లి చేసుకోవడం ఎప్పటి నుండో కొనసాగుతూనే ఉంది. వెండితెరపై క్రేజీ జంటగా పేరొందిన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఫీలవుతుంటారు. అటువంటి జంటల్లో ఒకరూ అజిత్-షాలిని. కోలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న ఈ జంట.. ఇటీవల ఓ న్యూస్తో తెరమీదకు వచ్చారు. కొన్ని రోజుల నుండి అజిత్-షాలినికి పొసగడం లేదని, ఇన్నాళ్లు సర్దుకుపోయిన ఈ జంట.. విబేధాలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు వీటికి ఆజ్యం పోశాయి. అయితే దీనిపై అజిత్ కానీ షాలినీ కానీ స్పందించలేదు. ఈ విడాకుల వార్తతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు.
అజిత్-షాలిని ఓ సినిమాలో నటించగా.. పరిచయం ప్రేమగా ఏర్పడి పెళ్లి చేసుకున్నారు . వీరి వివాహమయ్యి 21 ఏళ్లు అవుతుంది. అన్యోన్య దంపతులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతలోనే విడాకుల వార్త గుప్పుమంది. ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టినట్లు కనిపిస్తుంది ఈ జంట. ఇటీవల కుటుంబ సభ్యులతో గడిపిన ఫోటోలను, అజిత్తో దిగిన ఫోటోను షాలిని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులో అజిత్, షాలిని వారి పిల్లలు అనౌష్క, అద్విత్ కూడా ఉన్నారు. ‘పిల్లలతో ఉండటం వల్ల ఆత్మ సంతృప్తి చెందుతుంది’ అని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా అజిత్ తో దిగిన ఫోటోను పంచుకుని.. లవ్ సింబల్ జోడించారు. ఈ ఫోటోలను చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఇందులో అజిత్, షాలిని స్టైలిష్ లుక్స్లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ ఫోటోలతో తాము విడిపోవడం లేదని షాలిని చెప్పకనే చెప్పినట్లు కోలీవుడ్ చెప్పుకుంటోంది. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో తనివు సినిమాతో పలకరించారు అజిత్. ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. తెలుగులో తెగింపు పేరుతో విడుదలైంది. ఇప్పుడు ఆయన 62వ సినిమా కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా భారీగా ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ పనిచేయనున్నాడు. మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం ఆర్య, అరుళ్ నిథి, కాజల్ అగర్వాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారట దర్శక, నిర్మాతలు. ఈ సినిమాపై అధికారిక ప్రకటన మరో రెండు వారాల్లో రానున్నట్లు తెలుస్తోంది.