ఇటీవల ఓ ప్రేమ జంట గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే స్టేషన్ లో ఆ యువతి తన ప్రియుడికి ఊహించని షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చివరికి ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుంటున్నారు. తీరా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ప్రతీ చిన్న దానికి గొడవలు పడడం, చివరికి భర్తకు విడాకులు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆ జంట రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. పోలీసుల ఎదుటే ఆ యువతి యువకుడికి ఊహించని ఝలక్ ఇచ్చింది. ఈ దెబ్బతో అతడికి ఏం చేయాలో అస్సలు అర్థంకాక నెత్తి, నోరు బాదుకున్నాడు. ఇంతకు ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
స్థానికుల కథనం ప్రకారం.. తమిళనాడు అన్నానగర్ పరిధిలోని తిరుపూర్ పూండికి చెందిన యువతి (23)కి, కోయంబత్తూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్ల పాటు కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక ఆ యువతి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 17న ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు.
అనంతరం ఆ జంట రక్షణ కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించారు. ఇక కూతురుని చూసి ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మొత్తానికి ఆ యువతి మనసు మార్చుకుంది. తన మెడలో ఉన్న తాళి తీసి ఆ యువకుడి తప్పు ఏం లేదంటూ తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ఆ యువకుడు నెత్తి, నోరు బాదుకున్నాడు. అనంతరం పోలీసులు ఆ యువకుడికి సర్ది చెప్పడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుని చివరికి తల్లిదండ్రులతో వెళ్లిపోయిన యువతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.