తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు రాజ్యమేలుతున్న ఒకానొక టైంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది చెప్పే పేరు విజయశాంతి. కమర్షియల్ సినిమాలు మాత్రమే అని కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అప్పట్లో పేరు సంపాదించింది. లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ తో పిలిపించుకుంది. ఇక నటిగా మొదలైన ఈమె నిర్మాత, రాజకీయ నాయకురాలిగానూ తన మార్క్ క్రియేట్ చేసింది. దాదాపు 40 ఏళ్ల కెరీర్ లో 187 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడవి కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా విజయశాంతి చేసిన పాత్రలు ఇప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన భామలకు చాలావరకు ఇన్సిపిరేషన్ అనే చెప్పాలి. అలానే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ కొన్ని మూవీస్ చేసిన ఈమె.. చివరగా 2020 సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో కనిపించింది. ఆ తర్వాత ఛాన్సులొచ్చాయో లేదా తెలియదు గానీ బిగ్ స్క్రీన్ పై కనిపించడం మానేసింది. పూర్తిగా రాజకీయాలకే అంకితమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు గతంలో షూటింగ్స్ సమయంలో జరిగిన ప్రమాదాల గురించి బయటపెట్టింది.
‘నేను యాక్ట్ చేసిన ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’, ‘ఒసేయ్ రాములమ్మ’.. మూడు సినిమాలు కూడా మూడు ఆణిముత్యాల్లాంటివి. నేను కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. అవి నా లైఫ్ లో చాలా ఉపయోగపడ్డాయి. నా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా నేనేవరి నుంచి సహాయం ఆశించలేదు. నా మొదటి రెమ్యునరేషన్ రూ.5 వేలు. అక్కడి నుంచి రూ.కోటి తీసుకునే వరకు వెళ్లాను. అప్పట్లో మన దేశంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్స్ లో అమితాబ్, రజనీకాంత్ తర్వాత నేను ఉంటాను. జీవితంలో చాలాసార్లు చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డాను. ‘లేడీ బాస్’ క్లైమాక్స్ సీన్ షూటింగ్ లో రైలు నుంచి జారి లోయలో పడబోయాను. త్రుటిలో తప్పించుకున్నాను. అంత ప్రమాదం అని తెలిసి దర్శకనిర్మాతలు ఆ సీన్ వద్దన్నారు. కానీ నేను షూటింగ్ కంప్లీట్ చేశాను. మరో మూవీ చిత్రీకరణలో నా చీర, జత్తుకు మంటలు అంటుకున్నాయి. ఇలా పలుమార్లు చావు వరకు వెళ్లొచ్చా’ అని విజయశాంతి చెప్పుకొచ్చారు. మరి ఈమె వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.