స్వయంవరం సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు హీరో తొట్టెంపూడి వేణు. ఆ తర్వాత చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి, పెళ్లాం ఊరిళితే చిత్రాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. నటన, కామెడీ రెండింటితో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో దాదాపు 9 ఏళ్ల తర్వాత.. రవితేజ చిత్రం రామరావు ఆన్డ్యూటీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇందులో వేణు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బుధవారం చిత్రబృందం వేణు ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా వేణు సోషల్ మీడియా వేదికగా రామరావు ఆన్డ్యూటీ సినిమా విశేషాలే కాక.. పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు.
ఈ సదర్భంగా వేణు మాట్లాడుతూ.. ” నేను మొదటి ప్రాధాన్యం సినిమాలకే ఇస్తాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నాను. ఆ సయమంలో కూడా నేను ఖాళీగా లేను. ఇతర పనులతో బిజీగా ఉన్నాను. లాక్డౌన్ సమయంలో నాకు తీరిక దొరికింది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశాను. మరీ ముఖ్యంగా ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు చూడ్డం ప్రారంభించాను. కొందరి నటన చూసి అసూయ పడ్డాను కూడా. చాలా మంచి కంటెంట్ వస్తుంది అనిపించింది. అలాంటి సమయంలో నా ముందుకు రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చింది. ఈ సినిమా దర్శకనిర్మాతలు చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగినా ఒప్పుకోలేదు. దాటవేస్తు వచ్చాను’’ అని తెలిపాడు
‘‘మీరు సినిమాలో నటించకపోయినా పర్లేదు… ఓసారి కలుద్దామని డైరెక్టర్ శరత్ మండవ మేసేజ్ చేశారు. అలా ఒకసారి కలిసాను. అప్పుడు నా పాత్ర ఎలా డిజైన్ చేశారో చెప్పారు. అంతేకాక ఈ పాత్ర కోసం మిమ్మల్నే అనుకున్నాను అని తెలిపాడు. నాకు కూడా క్యారెక్టర్ నచ్చడంతో ఒకే చెప్పాను. అంతకు ముందు చాలా కథలు విన్నాను. ముందు ఇది స్టార్ట్ అయ్యింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ మురళి పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నం. ఇక రవితేజతో నటించడం చాలా మంచి అనుభూతి** అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు రామారావు ఆన్ డ్యూటీ సినిమాతోపాటు పారా హుషార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.