జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మూడో సినిమాకు సంబంధించి మీడియోలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన తెలుగులో ఓ టాప్ హీరోతో తన మూడో సినిమా చేయనున్నారట.
‘జాతిరత్నాలు’ సినిమాతో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కేవీ అనుదీప్. ‘జాతి రత్నాలు’ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రెండ్ సెట్టర్గా మారింది. సినిమా సాధించిన విజయంతో కేవీ అనుదీప్ స్థాయి ఇండస్ట్రీలో ఓ రెంజ్లోకి వెళ్లిపోయింది. జాతిరత్నాలు తర్వాత కేవీ అనుదీప్ ఓ తమిళ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా ‘ప్రిన్స్’ అనే సినిమాను చేశారు. అయితే, ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. అయినప్పటికి అనుదీప్పై ఉన్న అంచనాలు మాత్రం తగ్గలేదు.
ప్రిన్స్ సినిమా తర్వాత అనుదీప్నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అనుదీప్ సైలెంట్ అయిపోయాడు అని అనుకుంటున్న ఈ నేపథ్యంలో.. ఆయన సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. అనుదీప్ తెలుగులో ఓ స్టార్ హీరోతో తన మూడో సినిమా చేయబోతున్నారట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. దర్శకుడు అనుదీప్ రవితేజ కోసమే ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నారు. ఆ కథతో రవితేజ దగ్గరకు వెళ్లారు. ఆయనకు స్టోరీ నరేట్ చేశారు.
అనుదీప్ చెప్పిన స్టోరీ రవితేజకు పిచ్చపిచ్చగా నచ్చింది. సినిమా చేయటానికి ఆయన ఓకే చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నదని సమాచారం. మీడియాలో వస్తున్న వార్తలే నిజం అయితే గనుక ఇండస్ట్రీకి ఓ హిట్టు పక్కా కానుంది. రవితేజ, అనుదీప్ల కామెడీ టైమింగ్తో సినిమా ఫన్ రైడ్ అవ్వనుంది. ఆ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందనటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి, రవితేజ, అనుదీప్ల కాంబినేషన్లలో సినిమా రానున్నదని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.