బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చారు. ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి బంగారు బొనమెత్తారు.
తెలంగాణలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో చోట వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఇక్కడే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగానని, చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటానని అన్నారు. ప్రతి ఏటా తన తల్లిదండ్రులతో ప్రతి పండుగకు ఈ అమ్మవారి గుడికి వస్తానని అన్నారు.
బేబీ సినిమా విజయవంతమైన తర్వాత అమ్మవారికి బోనం తీసుకురావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఏటా బోనాలు మంచిగా జరుగుతున్నట్టు.. ఈసారి కూడా బాగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, మనందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. బేబీ సినిమా రిలీజ్ కి ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనమెత్తానని.. దర్శనం కూడా బాగా జరిగిందని అన్నారు. గతంలో సామాన్యురాలిలా లైన్ లో నిలబడి వచ్చేదాన్నని.. ఇప్పుడు స్పెషల్ ఎంట్రీతో వస్తున్నా అని చెప్పుకొచ్చారు. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్ములు, వెబ్ సిరీస్ లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత అల వైకుంఠపురములో, రంగ్ దే, టక్ జగదీశ్, వరుడు కావలెను, వలిమై, ప్రేమదేశం సినిమాల్లో నటించారు. మొదటిసారిగా హీరోయిన్ గా బేబీ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. యూట్యూబర్ హీరోయిన్ ఏంటని అవమానించిన ఎంతోమందికి ఆమె ఈ సినిమాతో బుద్ధి చెప్పారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు నటించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య నటన చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
అమ్మవారు అందరికీ మంచి చేయాలి | Actress Vaishnavi Chaitanya Participates in Lal Darwaja Bonalu | hmtv#hmtvnews #hmtv pic.twitter.com/7i0x7XWSMF
— hmtv News (@hmtvnewslive) July 16, 2023