యూఏఈ దేశం పెట్రోల్ ఉత్పత్తికి పెట్టింది పేరు. ఇతర అరబ్ దేశాల లాగా కేవలం పెట్రోల్ ఎగుమతులపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాపై వైపు చూస్తోంది. ఇతర రంగాలను ముఖ్యంగా పరిశ్రమల పెట్టుబడులకు, పర్యాటక, సినీరంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఇతర దేశాల పౌరులను ఆకర్షిస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచంలోని ప్రముఖలకు, వారి కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసా జారీ చేస్తుంది. పెట్టుబడిదారులను, సెలబ్రిటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో 2009 నుంచి ఇలా గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Indian Film Producer Mr. @BoneyKapoor along with his daughters, Indian Film Actress Ms. Janhvi Kapoor and Ms. Khushi Kapoor visited the #IndiaPavilion at @expo2020dubai today. #IndiaAtDubaiExpo #Expo2020Dubai pic.twitter.com/yIlqvBXZHh
— India at Expo 2020 (@IndiaExpo2020) November 11, 2021
ప్రపంచదేశాల్లోని కొందరి ప్రముఖలకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ వీసాను తాజాగా భారతదేశానికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బోనీకపూర్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ఈ గోల్డెన్ వీసా జారీ చేసింది. తద్వారా దుబాయ్ కు రెగ్యులర్ గా వచ్చే అవకాశాన్ని బోనీకపూర్ ఫ్యామిలీకి యూఏఈ ప్రభుత్వం కల్పించింది. బోనీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా .. ఆయనతో పాటు జాన్వీ, ఖూషీ కపూర్ లు యూఏఈ ప్రభత్వం నుంచి వీసాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వీరి కుటుంబ సభ్యులు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Thank you to Dubai Government for granting me and my 4 children Golden Visa on my Birthday @DXBMediaOffice pic.twitter.com/vlVn5x6Bm1
— Boney Kapoor (@BoneyKapoor) November 11, 2021