ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా ఇదే జాబితాలో చేరిపోయారు సీరియల్ హీరోహీరోయిన్లు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వీరిద్దరూ.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. ఇటీవల ఏ శుభకార్యమైనా సెలబ్రేషన్స్ అన్ని సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు అమర్ దీప్ – తేజస్వినిల మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలోనే జరుపుతున్నారు. రెండు రోజుల క్రితమే అమర్, తేజస్వినిల హల్దీ వేడుకలు జరిగాయి.
ఈ క్రమంలో వేరు వేరు సీరియల్స్ లో నటిస్తున్న అమర్ దీప్, తేజస్విని ఎక్కడ కలిశారు? వీరి సంబంధం ఎలా కుదిరింది? ప్రేమ పెళ్లా లేక పెద్దలు కుదిర్చారా? ఇన్ని సందేహాల మధ్య అభిమానులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో హీరోగా అమర్ దీప్ నటిస్తుండగా.. ‘కేరాఫ్ అనసూయ’ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది తేజస్విని. కాగా.. తెలుగబ్బాయి అయిన అమర్ దీప్.. బిటెక్ పూర్తి చేసి లండన్ లో హైయర్ స్టడీస్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఇండియాకి తిరిగొచ్చాక ‘పరిణయం’ అనే షార్ట్ ఫిల్మ్ తో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించాడు. అలా షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు.
ఇక `ఉయ్యాల జంపాల` అనే సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత `సిరిసిరి మువ్వ` సీరియల్ తో లీడ్ యాక్టర్ గా మారాడు. మరోవైపు కర్ణాటకకు చెందిన తేజస్విని గౌడ.. ఎలక్ట్రానిక్స్ లో బిటెక్ పూర్తి చేసి మోడలింగ్ లో అడుగుపెట్టింది. అలా ముందుగా తమిళ సీరియల్స్ లో అవకాశం అందుకొని.. కేరాఫ్ అనసూయ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం అమర్ దీప్, తేజస్వినిల జంట బుల్లితెరపై ఎంతో పాపులర్ అయ్యింది. ఇప్పుడైతే వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అమర్ దీప్ – తేజస్వినిల జంటపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.