దిల్ రాజు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈయన స్టార్ హీరో కాకపోయినప్పటికీ స్టార్ హీరోలంత క్రేజ్ ఉన్న వ్యక్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఆ సినిమా పేరునే ఇంటిపేరు గా మార్చుకున్నారు. కరోనా సమయంలో దిల్ రాజు తేజస్విని ద్వితీయ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు తన బిడ్డను ఎత్తుకున్న ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి దిల్ రాజు వారసుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు వారసుడిని ఇళయ దళపతి విజయ్ ఎత్తుకుని ఆడిస్తున్నాడు.
దిల్ రాజు మొదటి భార్య అనిత కొన్నేళ్ల క్రితం మరణించింది. వీరిద్దరికి హన్షిత కూతురు ఉంది. ఆమె.. దిల్ రాజు నిర్మించే సినిమాల నిర్మాణ పనులను వ్యవహారాలను చూసుకుంటారు. కాగా డిసెంబర్ 10, 2020.. నిర్మాత దిల్రాజు, తేజస్వినిల వివాహం నిజామాబాద్లోని ఫామ్ హౌస్లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వీరికి 2022 జూన్ 29న మగబిడ్డ జన్మించాడు. దిల్ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళ హీరో దళపతి విజయ్ మాస్టర్ సినిమా తర్వాత తెలుగులో వారసుడు (వారిసు) అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది.
‘వారసుడు’ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్, దిల్ రాజు ఇంటి వెళ్లాడు. అంతే కాక దిల్ రాజు కుమారుడిని ఎత్తుకుని ఆడించాడు. ఆ చిన్నోడి అందాన్ని చూస్తూ విజయ్ మైమరిచిపోయాడు. ప్రస్తుతం దిల్ రాజు వారసుడు, వారసుడు సినిమా హీరో విజయ్ కలసి ఇచ్చిన ఫోజులు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు కుమారుడుని చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
భలే ముద్దుగా ఉన్నాడే అంటూ, క్యూట్ బాయ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దిల్ రాజు ఇతరసినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం RC 15ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. వీటి తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అలాగే పలు భారీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ తో బిజీగా వున్నారు.
#ThalapathyVijay with #DilRaju‘s Child pic.twitter.com/Wqei1s4UJS
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 31, 2022