ఫిల్మ్ డెస్క్- కరోనా అన్ని రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా అతలాకుతలం చేసంది. కరోనా నేపధ్యంలో సినిమా ధియోదర్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో కోట్ల రూపాయుల పెట్టి నిర్మించిన సినిమాలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అందుకని ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున్న సినమాలన్నీ ఓటీటీ బాపట్టాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీతో మంచి డీల్ కుదుర్చుకోవడంతో డిజిటల్ ప్లాట్ఫామ్లోనే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇంకా ఏ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయే ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమా బండి….
వైవిద్యమైన టైటిల్ తో తెరకెక్కిన సినిమా సినిమా బండి. ఏ మాత్రం అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండి ఈనెల 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాటా ఫాం నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.
బట్టల రామస్వామి బయోపిక్కు
ఇక ఓటీటీలో రిలీజ్ ఆవుతున్న మరో సినిమా బట్టల రామస్వామి. అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని ఈ సినిమాను నిర్మించారు. ప్రముథ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. బట్టల రామస్వామి కూడా జీ-5 ఓటీటీలో ఈనెల 14 న విడుదల అవుతోంది.
డీ కంపెనీ
ఇక వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం డి-కంపెనీ. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలీ, రుద్రకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. డీ కంపెనీ స్పార్క్ ఓటీటీలో మే 15 న విడుదల కాబోతోంది.
నవంబర్ స్టోరీ
ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదల అవుతున్న మరో సినిా నంవబర్ స్టోరి. తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ లో జీఎం కుమార్, పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ కు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించగా, ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా మే 20న డిస్నీ+ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది.
ఏ1 ఎక్స్ప్రెస్
ఏ1 ఎక్స్ ప్రెస్.. సందీప్ కిషన్ హాకీ ఆటగాడిగా నటించాడు ఈ సినిమాలో. అందాల తార లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేశ్ నటించారు. ఐతే మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 1నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతోంది.
థ్యాంక్ యు బ్రదర్
జబర్ధస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థ్యాంక్ యు బ్రదర్. ఈ సినిమాను ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనుకోకుండా థియేటర్లు మూత పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 7న ఆహాలో విడుదలైంది.
ఏక్ మినీ కథ..
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన చిన్న బడ్జెట్ చిత్రం ఏక్ మినీ కథ. సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏక్ మినీ కథ తో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతుండగా, మేర్లపాక గాంధీ రచయితగా పని చేశాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఆమేజాన్ ప్రయత్నం ఫలిస్తే త్వరలోనే ఏక్ మినీ కథ ఓటీటీలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.
అరణ్య
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన అరణ్య ఇప్పటికే ధియోటర్లలో విడుదలైంది. ఐతే అంతలోనే ధియోటర్స్ మూతపడటంతో ఇప్పుడు నిర్మాతలు ఓటీటీవైపు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 ప్లాట్ఫామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మే 14 లేదా ఈ నెలాఖరులో జీ 5లో అరణ్య విడుదల కాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
రాధే..
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే జీ 5లో మే 13 నుంచి ప్రసారం కానుంది.అంతే కాదు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చెక్, రంగ్ దే సినిమాలు కూడా ఇదే నెలలో ఓటీటీలోకి రానున్నాయని తెలుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కూడా పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తమిళ హీరో ధనుష్ నటించిన జగమే తంత్రం వచ్చే నెల 18న నెట్ఫ్లిక్స్లో విడుదల కాబోతోంది. ఇలా చిన్న సినిమాల నుంచి మొదలు పెద్ద సినిమాల వరకు అన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదల అయ్యేందుకు లైన్ కట్టాయి.