నందమూరి బాలకృష్ణ.. థియేటర్లలో మాస్ జాతర జరగడానికి, అభిమానులు పూనకాలతో ఊగిపోవడానికి ఈ పేరు చాలు. అందుకు తగ్గట్లే బాలయ్య కూడా మాస్ కథలే దాదాపు చేస్తుంటాడు. ఇక బాలయ్య, ఫ్యాక్షన్ స్టోరీ అయితే డెడ్లీ కాంబినేషన్. గతంలో ఇదే తరహా కథలతో చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేశాయి. ఇప్పుడు అదే టెంప్లేట్ తో వస్తున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్, సాంగ్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. బాలయ్య సినిమాలంటే ఎంత మాస్ గా ఉంటాయో, ఈవెంట్స్ లో ఆయన చేసే సందడి అంతే కూల్ గా ఉంటుంది. తాజాగా ఒంగోలులో ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, అందులో ఆయన ఫుల్ ఎనర్జీతో కనిపించారు. ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు. హీరోయిన్లపైనే పంచులు వేస్తూ ఆకట్టుకున్నారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమా గురించి అందరూ మాట్లాడారు. బాలయ్యని మెచ్చుకున్నారు. ఇదంతా పక్కనబెడితే బాలయ్య కట్టుకున్న వాచ్ కాస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోల్డ్ కలర్ బ్లెజర్ లో కనిపించిన బాలయ్య.. అదే టైంలో మన సంస్కృతిని అద్దంపట్టేలా ధోతిలోనూ హుందాగా కనిపించారు. ఇదే కార్యక్రమంలో బాలకృష్ణ డ్రస్ తోపాటు ఆయన చేతికి ధరించిన బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉన్న వాచ్.. అందరీ దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వాచ్ విషయానికొస్తే.. ఫేమస్ బ్రాండ్ అయిన కార్టియర్ కు చెందింది. ఈ చేతి వాచ్ ధర రూ.24,58,987 అని అధికారిక వెబ్ సైట్ లో ఉంది. అలానే ‘కార్టియర్ సాంటోస్ 100 స్కెలెటన్’ పేరుతో ఉన్న ఈ వాచ్ ని కూతురు బ్రహ్మణి, తండ్రి బాలకృష్ణకు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే ఈ వాచ్ కు ఓ చరిత్ర కూడా ఉన్నట్లు సమాచారం. 1847 పారిస్ లో ప్రారంభమైన కార్టియర్ సంస్థ.. అప్పటినుంచి ఎప్పటికప్పుడు యునిక్ డిజైన్స్ తో వినియోగదారుల్ని ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు బాలయ్య ఆ వాచ్ ధరించడంతో దీని గురించి ఇప్పుడు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి బాలయ్య వాచ్ ఖరీదు తెలియగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.