అందుతున్న సమాచారం ప్రకారం.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులందరూ హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. మరి కాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆస్పత్రి వైద్యులు ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు ‘తారకరత్న’ మృత్యువుతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత 23 రోజులుగా తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు వార్తలొస్తున్నాయే తప్ప.. ఆస్పత్రి వైద్యుల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల అవ్వలేదు. అయితే, ఇప్పటికే బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారన్నది వాస్తవం.
శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి వైద్యులు తారకరత్న బ్రెయిన్కు మరోసారి బ్రెయిన్ స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులందరూ హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. గత 23 రోజులుగా తారకరత్న సతీమణి, పిల్లలు, తండ్రి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు టీడీపీ నేతలు ఆస్పత్రికి వస్తుండటంతో హృదయాలయ పరిసరప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు టీడీపీ ముఖ్యనేతలు సైతం ఒక్కొక్కరుగా నారాయణ హృదయాలయ ఆస్పత్రి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. మరి కాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్పత్రి వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నదానిపై కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హెల్త్ బులెటిన్లో వైద్యులు ఏం చెబుతారో అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఇవాళ రాత్రికి అనగా శనివారం అర్ధరాత్రి సమయంలో తారకరత్నను బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే అవకాశం ఉందని నందమూరి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ఈ వార్తలు నందమూరి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
Reports says actor #tarakaratna is likely to be shifted to #Hyderabad tonight. #Hebbagodi police arrived at #NarayanaHrudalaya. pic.twitter.com/p4NFr1BdjL
— dinesh akula (@dineshakula) February 18, 2023
కాగా, నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు అంతా ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఈ క్రమంలో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత 23 రోజులుగా అక్కడే చికిత్స అందుతోంది.
Andhra ex minister @KolluROfficial seen at Narayana hrudayalaya to see #tarakaratna who is very critical#TarakaratnaHealthUpdate pic.twitter.com/PkxQQZSZu3
— @vikas.k.inventor (@vikasinventor) February 18, 2023