అర్జున్-విశ్వక్ సేన్.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేర్లు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ తో సినిమా ఆపేస్తున్నట్లు ప్రకటించాడు అర్జున్. ఇక ఈ విషయం పై విశ్వక్ సేన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో నాలాంటి కమిట్ మెంట్ హీరో ఎవరూ లేరని, నాకు కమిట్ మెంట్ లేదని పరిశ్రమలో ఏ ఒక్క లైట్ బాయ్ చెప్పినా నేను ఇండస్ట్రీ వదిలి పోతానని హీరో విశ్వక్ సేన్ సవాల్ విసిరాడు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. ఈ కాలంలో యంగ్ హీరోల యాటిట్యూడ్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని విమర్శించాడు.
విశ్వక్ సేన్.. అర్జున్ విషయంలో అనుసరించిన తీరు నిర్మాతలకు, డైరెక్టర్లకు అవమానమే అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అర్జున్-విశ్వక్ ల వివాదంపై తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..”సినిమా స్టార్ట్ చేసే ముందే మూవీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఒక్కసారి కమిట్ అయ్యాక పాటలు బాలేవు, పారితోషికం తక్కువైంది, నిర్మాత నచ్చలేదు లాంటి విషయాలు సెట్ పైకి రావొద్దు. ఇక ఈ కాలం యంగ్ హీరోలు కథల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి. వారు కథల్లో జోక్యం చేసుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ లుగా నిలుస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్, బాలకృష్ణ మరికొంత మంది హీరోలు డైరెక్టర్ ఏది చెప్పితే అదే చేసేవారని” భరద్వాజ గుర్తు చేసుకున్నారు.
ఇక ఈ వివాదంలో కొన్ని విషయాలు మార్చాలి అంటూ విశ్వక్ సేన్ అర్జున్ కు చెప్పినట్లుగా విశ్వక్ చెప్పుకొచ్చాడు. అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ అని భరద్వాజ చెప్పుకొచ్చారు. అర్జున్ అవుట్ డేటెడ్ అని విశ్వక్ అనుకుంటే అసలు సినిమానే ఒప్పుకోకుంటే బాగుండేది కదా అని తమ్మారెడ్డి అన్నారు. ఇక యంగ్ హీరోలు ఫంక్షన్స్ లో మాట్లాడే మాటలపై ఫైర్ అయ్యారు తమ్మారెడ్డి. సినిమా ఫంక్షన్స్ లో యంగ్ హీరోలు ప్రేక్షకులను ఇరిటేట్ చేసేలా గొప్పలు మాట్లాడ్డం తగ్గించుకోవాలని సూచించాడు. ప్రేక్షకులను గౌరవించడం నేర్చుకోవాలని అన్నాడు. ఈ వివాదంలో విశ్వక్ సేన్ అనుసరించిన పద్దతి నిర్మాతలకు, డైరెక్టర్లకు అవమానమే అని మండిపడ్డారు. విశ్వక్ మాత్రమే కాదు మరికొంత మంది యంగ్ హీరోలు తమ పద్దతి మార్చుకుంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి ఇప్పటికైనా మార్చుకోవాలని పేర్కొన్నాడు.