తమిళ ఇండస్ట్రీలో ఖైదీ, విక్రమ్ సినిమాలు సృష్టించిన భీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ యాక్షన్ మాఫియా సినిమాలు.. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశాయి. ఖైదీ సినిమాతో హీరో కార్తీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్.. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఆల్ టైమ్ కెరీర్ హిట్ ఇవ్వడంతో పాటు విలన్ రోలెక్స్ పాత్రలో హీరో సూర్యని మొదటిసారి వయిలెంట్ గా ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేశాడు.
ఇక ఖైదీ, విక్రమ్ సినిమాలతో డైరెక్టర్ గా తన స్థాయిని పెంచుకున్న లోకేష్ నుండి ఎప్పుడెప్పుడు ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు తెరమీదకు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. దర్శకుడు లోకేష్ ఎప్పుడైతే డిల్లీ పాత్రలో కార్తీని, రోలెక్స్ పాత్రలో సూర్యను ఇంట్రడ్యూస్ చేశాడో.. అప్పటినుండి డిల్లీ, రోలెక్స్ పాత్రలపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే.. విక్రమ్ క్లైమాక్స్ లో డిల్లీ, రోలెక్స్ ల మధ్య పరస్పరం శత్రుత్వం క్రియేట్ అయినట్లు చూపించాడు.
ఈ లెక్కన తదుపరి ఖైదీ 2 లేదా విక్రమ్ 2 సినిమాలలో డిల్లీ, రోలెక్స్ ల మధ్య వార్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇటు డిల్లీకి గతం ఉందని, రోలెక్స్ 28 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యం అని చెప్పిన లోకేష్.. మరి గతంలో వీరిద్దరి మధ్య ఏదైనా లింక్ ఉందా? పరిచయం ఉందా? అనే అంశంపై మరింత ఆసక్తిని రేకెత్తించాడు. లోకేష్ మైండ్ లో స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించలేము. కానీ.. ఏదొక టైమ్ లో డిల్లీ, రోలెక్స్ ల మధ్య భీకరమైన ఫైట్ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో డిల్లీ, రోలెక్స్ ఎదురుపడే సన్నివేశం కూడా ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేని విధంగా ఉంటుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. అయితే.. డిల్లీ, రోలెక్స్ లు కలిస్తే ఎలా ఉంటుందా? అని హింట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా సూర్య, కార్తీ ఒకే వేదికపై క్లారిటీ ఇచ్చారు. సూర్య నటించిన ‘విరుమాన్’ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో కార్తీతో పాటు సూర్య కూడా హాజరయ్యాడు.
స్టేజిపై విరుమాన్ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడిన కార్తీ, సూర్య.. ఫ్యాన్స్ కోరిక మేరకు ఇద్దరినీ డిల్లీ, రోలెక్స్ ల డైలాగ్స్ చెప్పాలని ట్రై చేశారు. అయితే.. డైలాగ్ కంటే ముందు ఇద్దరూ కలిసి.. త్వరలోనే డిల్లీ, రోలెక్స్ ల ఫైట్ తెరపై చూసేందుకు వెయిట్ చేయాలని కోరారు. దీంతో కార్తీ, సూర్యల మాటలతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భీభత్సమైన ఫైట్ ఉంటుందని క్లారిటీ రావడంతో ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’పై అంచానాళ్ల పీక్స్ లోకి చేరుకున్నాయి. ప్రస్తుతం స్టేజిపై సూర్య, కార్తీ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి డిల్లీ, రోలెక్స్ కలిస్తే ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.