తాత వారసత్వాన్ని తీసుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు జూనియర్ ఎన్టీఆర్. నటనలో తాతకు తగ్గ మనవడు అన్న పేరు తెచ్చుకున్నారు. అంతేకాదూ డ్యాన్స్ ఇరగదీస్తారు. ఎన్టీఆర్ తో నటించిన హీరోహీరోయిన్లు కానీ, టెక్నిషియన్లు ఆయన నటనను చూసి ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు.
మహా నటుడు, తెలుగు దేశం వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్. నిన్నుచూడాలని అనే సినిమాతో పరిచయమైన ఆయన.. నేడు ఆస్కార్ స్థాయికి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.. గ్లోబల్ స్టార్గా మారిపోయారు. నటన, డ్యాన్స్, డైలాగ్స్లో తారక్ అందె వేసిన చేయి. ఈ విషయాలు తోటి నటీనటులు, దర్శక, నిర్మాతలు చెబుతూ ఆశ్చర్య పోతారు. అదేవిధంగా ఆయన ఏక సంతాగ్రహి అని కూడా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరో నటుడు జూ. ఎన్టీఆర్కు మంచి కితాబునిచ్చారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్ నటించిన మాస్ మూవీ అరవింద సమేత. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకున్నారు సీనియర్ నటుడు శుభ లేఖ సుధాకర్. ఆ షూటింగ్ సమయంలో తారక్ నటనను చూసి ఫిదా అయ్యారు. ఆయనకు లోలోపల తపన ఉంటుందని, ఆయలో్ కృషి, కసికి తాను ముగ్దుడునయ్యాయని ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధాకర్ పేర్కొన్నారు. ఎప్పుడు సెట్లో నవ్వుతూ ఉంటాడని, ఎప్పుడు డైలాగ్స్ చదువుతాడో తెలియదని, టేక్ అనేసరికి నాలుగు పేజీల డైలాగ్, ఐదు పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్లో ఫినీష్ చేస్తారని అన్నారు. ఎప్పుడు చదువుతారో, ఏం చేస్తారో తెలియదని వచ్చి అలా డైలాగ్ చెప్పేస్తారని అన్నారు. సెట్లో తారక్ డైలాగ్స్ చూసుకోవడం తానెప్పుడూ చూడలేదని చెప్పారు.
కెమెరాలో లేదా కో ఆర్టిస్ట్ తప్పు చేస్తే తప్ప, మరో టేక్కు వెళ్లరని, ఆయన తరపు నుండి ఫర్ ఫెక్ట్ అని కొనియాడారు. ఓ సారి రామ్ లక్ష్మణ్ ఓ సందర్భంలో ఓ విషయాన్నిచెప్పారంటూ గుర్తు చేసుకున్నారు. జూ. ఎన్టీఆర్ కెమెరా కోసమే పుట్టారని అన్నారని తెలిపారు. సింగిల్ టేక్ లో షాట్ చేయడం ఆయనలో ఉన్నగ్రేట్ క్వాలిటీ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమా కోసం ఫ్యాన్స్ వెయింటింగ్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుంది. ఈ నెల 23న ఈ సినిమా లాంచ్ ఉండనుంది. అప్పటి నుండి చిత్రీకరణ మొదలు కానుంది. జనతా గ్యారేజ్ సినిమా హిట్ తో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.