సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ కన్నుమూశారు. కళ్యాణి మీనన్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాదపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ఆమె జాయిన్ అయ్యారు. అయితే.., అక్కడ చికిత్స పొందుతూనే కళ్యాణి తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి గారే ఈ కళ్యాణి మీనన్. ఇక సింగర్ గా ఈమె తెలుగు, తమిళం, మలయాలం భాషలలో ఏకంగా 100కి పైగా పాటలు పాడారు. ఇక రెహమాన్ స్వరాలు అందించిన కాధలన్, ముత్తు, అలైపాయుథే, విన్నైతంది వరువాయ, ఏక్ దీవానా థా వంటి చిత్రాలలో కళ్యాణి మీనన్ అద్భుతమైన పాటలు ఆలపించారు.
2010 లో ఆమె భక్తి సంగీతానికి చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకుంది. ఇక కళ్యాణి మృతి పట్ల తమిళ, తెలుగు, మళయాళ చిత్ర పరిశ్రమ నివాళుర్పిస్తుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , సీనియర్ సింగర్ చిత్ర ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరి.. కళ్యాణి మీనన్ ఆత్మకి శాంతి చేకూరాలని మనము కోరుకుందాం.
Heartfelt condolences on the passing away of the noted singer Kalyani Menon. May her soul rest in peace. 🙏#KalyaniMenon #KSChithra @DirRajivMenon pic.twitter.com/HnUz963brC
— K S Chithra (@KSChithra) August 2, 2021