సినీ ఇండస్ట్రీలో ఏళ్లుగా కంటిన్యూ అవుతున్న ఆర్టిస్టులు ఏదొక రోజు ఇంటర్వ్యూలలో కెరీర్ ని, లైఫ్ స్ట్రగుల్స్ ని గుర్తుచేసుకుంటారు. కొన్ని సందర్భాలలో తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే.. ఇంకొన్నిసార్లు చేదు అనుభవాలను షేర్ చేసుకుంటారు. అయితే.. టాలీవుడ్ లో వందల సినిమాలు చేసి, దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి నటులలో శివాజీరాజా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. ఓ యాక్టర్ గురించి పేరు పెట్టకుండా వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తానెప్పుడూ ఎవరికీ భయపడలేదని, తప్పుడు నా కొడుకులు భయపడాలి గానీ నేనెందుకు భయపడాలి అన్నారు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
శివాజీరాజా మాట్లాడుతూ.. “నన్ను ఇండస్ట్రీలో ఓ మాట అనేవారు లేరు. ఎందుకంటే నేను తప్పు చేయను. షూటింగ్ లేటుగా వెళ్లను. ఇంకొకడి క్యారెక్టర్స్ కొట్టేయను. ఎవరి కాళ్లావేళ్లా పడను. నాకొచ్చిన క్యారెక్టర్స్ చేస్తా లేదంటే కామ్ గా కూర్చుంటా. ఈ మాటలు ఎందుకు అన్నానంటే.. ఒకడికి తగలాలి. ఈ దెబ్బ వీడు నా గురించే అన్నాడని ఒకడికి తెలియాలి. అందుకే చెబుతున్నాను.. ఒరేయ్ నీలాంటి బొగడాగాళ్ళను చాలామందిని చూశా.. బ్యాక్ గ్రౌండ్స్ తెలియకుండా మాట్లాడతావ్ నువ్వు అని ఒకడికి తెలియాలని చెప్పా. వాడెవడో పేర్లు అవసరం లేదు. కానీ.. నా మాటలు విని వాడు నా గురించే అన్నాడని నవ్వుకుంటాడు” అన్నారు.
దీంతో యాంకర్ ఉండి.. మీరు చెప్పిన వ్యక్తి గొప్పవాడేనా? అని అడగ్గా.. వాడంతా గొప్పవాడు కాదు.. అందుకే మ్యాటర్ ఇంకా లాగలేదు అని చెప్పాడు. అంతేగాక.. ముప్పై ఏళ్లలో ఎంతోమంది వెదవలను చూశాను. ఎన్ని ఢక్కాముక్కీలు తింటే గాని ఈ స్టేజికి వస్తాను. లైఫ్ లో చాలామంది వెదవలు పక్కనే ఉంటారు. మనం ఓడిపోతే పక్కోడి టీమ్ లో చేరి డాన్స్ చేస్తుంటారు.” అని చెప్పారు. ఇప్పుడు శివాజీరాజా మాటలు బట్టి.. సోషల్ మీడియాలో నెటిజన్స్ రెగ్యులర్ గా వార్తల్లో కనిపించే ఓ యాక్టర్ గురించే అనుకుంటున్నారు. ఆ యాక్టర్ ఎవరో కూడా గెస్ చేస్తున్నారు. ప్రస్తుతం శివాజీరాజా మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.