తెలుగు ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేసి కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుద్విశ్వాస విడిచారు. కృష్ణ మరణవార్త విన్న తర్వాత కుటుంబ సభ్యులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు శోక సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.. కన్నీటి వీడ్కోలు పలికారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కి ఆయన మనవలు, మనవరాళ్లు అంటే ఎంతో ప్రేమ. తాజాగా తన తాతయ్య గురించి మహేష్ బాబు కూతురు సితార ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కదిలించింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నానక్ రామ్ గుడలో ఉంటున్న కృష్ణను వీక్ ఎండ్ లో మహేష్ బాబు తన భార్యాబిడ్డలతో వెళ్లి కలిసేవారు. ఆ సమయంలో కృష్ణతో మహేష్ బాబు కూతురు సితారతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలో సితార ఘట్టమనేని తన తాతయ్య సూపర్ స్టార్ కృష్ణని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యింది. తాతయ్యతో ఉన్న అనుబంధం.. జ్ఞాపకాలను ఎంతో బాధతో తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. ‘ఇక ప్రతి వీక్ ఎండ్ లంచ్ గతంలో మాదిరిగా ఉండదు.. మీరు నాతో ఎన్నో మంచి విషయాలు పంచుకున్నారు.. గొప్ప విషయాలు నేర్పించారు. నన్ను బాగా నవ్వించారు.. అవి ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో ఉంటాయి.. మీరు నా హీరో.. ఎప్పటికైనా మీరు గర్వించేస్థాయికి చేరుకుంటా.. ఐ మిస్ యూ తాతగారు’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
సితార ఘట్టమనేని ఎమోషనల్ మెసేజ్ షేర్ చేయడంతో పాటు కృష్ణతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని రీతిలో సాహసాలు, ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఫైట్స్ కి కొత్త నిర్వచనం చెప్పిన నటుడు కృష్ణ. సోమవారం గుండెపోటుతో కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన ఆయన మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులే కాదు.. కృష్ణ తో అనుబంధం ఉన్న ప్రతి నటీ, నటుడు కన్నీరు పెట్టుకున్నారు.