మంచు మనోజ్, భూమా మౌనికల వివాహ వేడుకకు ప్రముఖ గాయని సునీత, ఆమె భర్త రామ్ వీరపనేని దంపతులు అతిథులుగా హాజరయ్యారు. మనోజ్, మౌనిక దంపతులను ఆశీర్వదించారు.
మంచు మనోజ్, మౌనికల వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో మంచు లక్ష్మి ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు మంచు మనోజ్, భూమా మౌనిక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మ, మౌనికరెడ్డి సోదరి అఖిల ప్రియ, శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి సిద్ధూ జొన్నలగడ్డ, తేజ సజ్జ, దర్శకుడు బాబీ, వెన్నెల కిషోర్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సింగర్ సునీత కూడా తన భర్త రామ్ వీరపనేనితో వేడుకలో సందడి చేశారు.
ఎప్పుడూ ఇలా బయట వేడుకలో సందడి చేయని ఈ జంట ఇలా మంచు మనోజ్ పెళ్లి వేడుకలో సందడి చేయడంతో మీడియా అటెన్షన్ కి కారణమైంది. దంపతులిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని వివాహ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దంపతులిద్దరూ కొత్త దంపతులను ఆశీర్వదించి బయటకు వచ్చారు. అనంతరం సునీత మీడియాను పలకరించారు. మీడియా మిత్రుల కోరిక మేరకు ఫోటోల కోసం ఫోజులిచ్చారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక మంచు మనోజ్, భూమా మౌనిక గత ఏడాది హైదరాబాద్ లో వినాయకచవితి ఉత్సవాల్లో సందడి చేశారు. అప్పటి నుంచే వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ నిన్న ఈ ఇద్దరూ ఒకటయ్యారు. 2015లో ప్రణతితో వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.