టాలీవుడ్ ఇటీవల ఓ మంచి డ్యాన్స్ మాస్టర్ను కోల్పోయింది. ఆయనే రాకేష్ మాస్టర్. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లిన అధికంగా మద్యం సేవించడంతో పాటు ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై చనిపోయారు.
టాలీవుడ్ ఇటీవల ఓ మంచి డ్యాన్స్ మాస్టర్ను కోల్పోయింది. ఆయనే రాకేష్ మాస్టర్. విజయనగరంలో షూటింగ్ నిమిత్తం వెళ్లి అధికంగా మద్యం సేవించడంతో పాటు ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ వచ్చాక కొన్ని రోజులు విరేచనాలు, రక్తపు వాంతులకు గురై ఈ నెల 18న కన్నుమూశారు. అయితే మాస్టర్ అంత్యక్రియలకు హాజరై ఘన నివాళులు అర్పించారు ఆయన శిష్యులు శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్. వారిని తిట్టినా (ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉండేవారు) పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నారు. ఈ రోజు రాకేష్ మాస్టర్ సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రియ శిష్యులు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ పాల్గొని.. ఎమోషనల్ అయ్యారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ..‘రాకేష్ మాస్టర్ గారిది,మాదీ ఎనిమిది సంవత్సరాల జర్నీ. బయట ప్రపంచం అంటే మాకు తెలియదు. నేను, సత్య మాస్టర్ విజయవాడలో డ్యాన్స్ నేర్చుకుని ఆ తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చాము. చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ఇప్పుడు ఆయన డ్యాన్సులు యూట్యూబ్లో చూస్తున్నారు..ఆ డ్యాన్స్ 5 పర్సంటే. ఆయన చాలా మంచి డ్యాన్సర్. మంచి స్టైల్ అండీ మాస్టర్ది. నాకు పర్సనల్గా ప్రభుదేవా అంటే ఇష్టం. కానీ హైదరాబాద్ వచ్చాక.. రాకేష్ మాస్టర్ డ్యాన్స్ చూసి ఇష్టపడ్డాను. ఇప్పుడు డ్యాన్స్ కాదు, గతంలో మేము ఉన్నప్పుడు ఆయన ఇంకా బాగా చేసేవారు. ఆయన మా గురువు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఫర్ ఫెక్ట్ గా చేసే వరకు ఊరుకునే వారు కాదు’అని ఎమోషనల్ అయ్యారు.
‘ఆయన ఎప్పుడు, ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. రాకేష్ మాస్టర్ మ్యారేజ్ చేసింది కూడా నేనే. మాకు వేరే ప్రపంచం తెలియదు. ఆయనతోనే ఉండి, ఇన్ స్టిట్యూట్ లోనే క్లాసులు చెప్పుకుంటూ, అక్కడే వండుకుని తిని బతికేశాం. తర్వాత మాస్టర్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మాకేమీ చేయాలో తోచక బయటకు వచ్చి మేము మాస్టర్స్గా మారిపోయాం. కొంత మంది యూట్యూబ్ ఛానల్స్.. ఏదో థంబ్ నెయిల్స్ పెట్టి.. ఏదోదో చేస్తున్నారు. దాని వల్ల వేరే ఫ్యామిలీ బాధపడుతున్నారు. ఏ విషయంలోనైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి. ప్లీజ్. మా మాస్టర్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్య, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇదే సందర్భంగా సత్య మాట్లాడుతూ.. బతికుండగా ఆయనకు ఏమీ చేశామని అంటున్నారు.. అదీ మాకు మాత్రమే తెలుసున్నారు. ‘మా వల్ల ఏం చేయగలిగామో అది చేశాం. నిజం ఏంటో తెలుసుకుని రాయండి.. శేఖర్ ఏం చేశాడో నాకు తెలుసు.. ఫ్యామిలీకి ఏం చేశాడో నాకు తెలుసు’అని పేర్కొన్నారు.