ప్రముఖ నటుడు శరత్ బాబు అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. మొదట బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్న శరత్బాబును.. ఆ తర్వాత ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వస్తున్నాయి. శరత్ బాబు ఆరోగ్యం క్షీణించిందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కన్నుమూశారని న్యూస్ వచ్చింది. సోషల్ మీడియాతో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్, ప్రముఖ వెబ్ సైట్లలోనూ ఈ రకమైన కథనాలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అది నిజమేనని అనుకున్నారు.
శరత్ బాబు మరణించారంటూ వస్తున్న వార్తలపై ఆయన సోదరి స్పందించారు. శరత్ బాబు క్షేమంగా ఉన్నారని ఆయన సోదరి, అన్నయ్య కొడుకు చెప్పారు. శరత్ బాబు వేగంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఆయన్ను నార్మల్ రూమ్కు షిఫ్ట్ చేశారని కూడా తెలియజేశారు. శరత్ బాబు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు, వార్తలను అస్సలు నమ్మొద్దని వాళ్లు విజ్ఞప్తి చేశారు. ఇకపోతే, శరత్ బాబు విషయంలోనే కాదు గతంలోనూ పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు, వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ తరహా న్యూస్ ఎక్కువగా వస్తుండటం గమనార్హం.
#SarathBabu Garu is Recovering..
Don’t Spread Rumors 🙏 pic.twitter.com/CUu28b4SVx— Fukkard (@Fukkard) May 3, 2023