ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఎవరికీ చెప్పకూడదని భావించారు. అయినప్పటికి సమంత అనారోగ్యంపై పలు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె తన అనారోగ్యంపై స్పందించారు. తాను మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెప్పుకొచ్చారు. ఓ పెద్ద నోట్ను కూడా రాసుకొచ్చారు.
వ్యాధినుంచి బయటపడిన తర్వాత చెబుదామనుకున్నా అని అన్నారు. తాను ఎన్నో కష్టనష్టాలనుంచి కోలుకున్నానని.. దీన్నుంచి కూడా కోలుకుంటానని ఆమె చెప్పారు. ఆ తర్వాత సమంత అనారోగ్యంపై దేశ వ్యాప్తంగా ఉన్న చాలా మంది సినీ సెలెబ్రిటీలు స్పందించారు. చిరంజీవి, యన్టీఆర్, నాగబాబు, అఖిల్ స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక, తనకు ఎంత అనారోగ్యం ఉన్నా… సమంత కమిట్ అయిన సినిమాల షూటింగ్లను, విడుదలకు సిద్ధమైన తన సినిమాల ప్రమోషన్లను పక్కన పెట్టడంలేదు. ఓ వైపు చికిత్స చేయించుకుంటూనే మరో వైపు సినిమాలు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమె తాజా చిత్రం ‘యశోద’ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ నాకు మంచి స్నేహితుడైన రాజ్ నిడిమోరు చెప్పినట్లు.. రోజు ఎలా ఉన్నా ముందుకు సాగాలి. నేను దాన్ని ఓ రోజుకు పాటిస్తాను. 11వ తేదీ యశోదగా మీ ముందుకు రాబోతున్నాను’’ అని పేర్కొన్నారు. దీనితో పాటు బ్లాక్ డ్రెస్లో ఆమె దిగిన ఓ మూడు ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.