టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్లలో తప్ప బయట ఎక్కడా పెద్దగా కనిపించటం లేదు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. సినిమా ప్రమోషన్లకు అవసరం అయితేనే తప్ప మీడియా ముందుకు రావటం లేదు. ఆమె నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘‘శాకుంతలం’’ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. సోమవారం జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.
గుణశేఖర్ స్టేజిపై మాట్లాడుతూ ఎమోషన్ అవ్వటంతో సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘‘ శాకుంతలం’’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ 20 ఏళ్ల క్రితం రిలీజైన నా ఒక్కడు సినిమాను ప్రభంజనంలా ఆదరిస్తున్న అందరకీ హ్యాట్సాఫ్. మంచి సినిమాను, మంచి కంటెంట్ను మీరు ఎలా ఆదరిస్తారు అనేదానికి ఒక్కడు లాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. శాకుంతలం సినిమా విషయానికి వస్తే.. ఇందులో ముగ్గురు హీరోలు. కథకి కథానాయకుడిగా దేవ్ మోహన్ హీరో అయితే.. సినిమాకు హీరో సమంత. సినిమా వెనుక హీరో దిల్రాజు గారు. ఈ సినిమా క్రెడిట్ను దిల్ రాజు గారికి ఇస్తాను. ఎందుకంటే.. మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉన్నారు’’ అని చెబుతూ ఎమోషన్ అయ్యారు.
మాట్లాడటానికి మాటలు రాక కొద్ది సేపు అలానే ఉండిపోయారు. కంట నీరు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత కూడా ఎమోషనల్ అయ్యారు. ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కంటి నుంచి నీరు ధారాపాతంగా కారాయి. కొద్దిసేపట్లోనే ఆమె తేరుకున్నారు. టిష్యూతో కన్నీళ్లు తుడుచుకుంటూ.. జనం అరుపులకు నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, మీడియా ముందు సమంత కన్నీళ్లు పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear @Samanthaprabhu2 ♥️ Many Heroines In Indian Film Industry May Come & Go, But You Are Always One For Me 🥺❤️ I Love You Forever & Ever 💕 @Samanthaprabhu2 Forever 💘 #SamanthaRuthPrabhu #Samantha #Shakunthalam #Samanthaforever pic.twitter.com/Pf3EBy5jiU
— RAJ KARTHIKEYA (@RAJKARTHIKEYA5) January 9, 2023