స్టార్ హీరోకి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన బాడీగార్డుతో సహా కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. గతంలో జర్నలిస్టుపై సల్మాన్ దాడి చేశాడనే కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2019లో జర్నలిస్టుపై దాడి చేశాడనే కేసులో సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డు నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ ఘటనపై సల్మాన్- నవాజ్ లపై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు తెరపైకి రావడంతో కోర్టు సమన్లు జారీ చేసి.. విచారణ ఏప్రిల్ 5కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: హగ్ చేసుకొని రియలైజ్ అయ్యానని సుధీర్ పై ఓపెన్ అయిన రష్మీ!
అసలు ఈ కేసు ఏంటంటే.. సల్మాన్ ఖాన్ 2019 ఏప్రిల్ 24న ముంబై వీధిలో సైకిల్ పై వెళ్తుండగా కొందరు మీడియా వాళ్లు ఫొటోలు తీశారంట. ఆ సమయంలో సహనం కోల్పోయి సల్మాన్ ఒకరి ఫోన్ లాక్కొని పగలగొట్టి.. వాగ్వాదానికి దిగాడని, తనను బెదిరించాడని పాండే ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీఎన్ నగర్ పోలీసులను కోర్టు గతంలో ఆదేశించింది. సల్మాన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే ఫిర్యాదులో కోరాడు. సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టైగర్ 3, కభీ ఈద్ కభీ దీపావళి సినిమాల్లో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ పై కేసు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.