హీరో హీరోయిన్లు, సెలబ్రిటీలు.. బయటకు వచ్చి.. రోడ్ల మీద తిరుగుతూ.. సామాన్యుల మాదిరి లైఫ్ ని ఎంజాయ్ చేయడం చాలా కష్టం. అభిమానులు గుర్తించి.. చుట్టూ ముగితే ఇక వారి పరిస్థితి అంతే. అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా విదేశాలకు చెక్కెస్తూ.. అక్కడ సాధారణ ప్రజల మాదిరి హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సినీ తారల విషయానికి వస్తే.. వారికి ఈ ఇబ్బంది కాస్త ఎక్కువే. ఈ క్రమంలో హీరోయిన్ సాయి పల్లవి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. బుర్ఖా వేసుకుని వెళ్లి.. థియేటర్ లో కూర్చుని సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్లను కొట్టిపారేస్తున్న నేచురల్ బ్యూటీ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తో దూసుకు పోవడమే కాక.. మంచి కలెక్షన్లు రాబడుతూ.. నాని కేరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆడియెన్స్ రెస్పాన్స్ ని ప్రత్యక్షంగా చేసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకుని థియేటర్ కు వెళ్లారు.
ఇది కూడా చదవండి : ఆమెతో డ్యాన్స్ చేసి మంచి డ్యాన్సర్ గా నిరూపించుకుంటా- చిరంజీవి
బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్కు డైరెక్టర్ రాహుల్తో కలిసి థియేటర్కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది.