చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గానీ కథ, పాత్ర నచ్చితేనే చేస్తానంటోంది. అందుకే చిరుతో నటించే ఛాన్స్ వచ్చిన గానీ వదులుకుందట. ఇంతకే ఆ సినిమా ఏంటంటే?
పోకిరి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా? ఇప్పుడు ఈ డైలాగ్ సాయి పల్లవి కి పర్ఫెక్ట్ గా సూటవుతుందని సాయి పల్లవి అభిమానులు అంటున్నారు. ఎన్ని సినిమాలు చేశామని కాదు హిట్ సినిమా చేశామా లేదా అనేదే సాయి పల్లవికి ముఖ్యం అని అభిమానులు సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లేటెస్ట్ గా వచ్చిన తెలుగు అగ్ర నటుడి సినిమాలో కూడా సాయి పల్లవి చేయకపోవటమే అందుకు ఉదాహరణ అని అభిమానులు అంటున్నారు. డబ్బుల కోసం సాయి పల్లవి సినిమాలు చేయదని కూడా వాళ్ళు అంటున్నారు. ఇంతకీ అభిమానులు సాయి పల్లవి గురించి వాళ్ళు చెప్తుందేంటి?
సాయి పల్లవి.. ప్రేమమ్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఆ ఒక్క సినిమాతోనే కుర్రకారు హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో తాను చేసిన పెర్ఫార్మెన్స్ నిజంగా సూపర్. ఆ తర్వాత తెలుగులో ఫిదా అనే సినిమాలో నటించి తెలుగు వారి అమ్మాయిగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో భానుమతి పాత్రలో అద్భుతంగా నటించడమే కాకుండా తానే ఆ పాత్రకు తగ్గట్లు తెలంగాణ యాస లో డబ్బింగ్ చెప్పుకుంటుంది. సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు సినిమా కి వెళ్ళాలి అనే రేంజ్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు చేసింది. సాయి పల్లవి సినీ కెరీర్ ని గమనిస్తే సాయి పల్లవి ఆచి తూచి సినిమాలు చేస్తుందని అర్థమవుతుంది.
ఇక అసలు విషయంలోకి వస్తే..సాయి పల్లవికి సినిమాల సెలక్షన్ లో గొప్ప జడ్జిమెంట్ ఉందని లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన బోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ పోషించిన క్యారెక్టర్ లో మొదట సాయి పల్లవి చేత నటింపచేయాలని చిత్ర బృందం సాయి పాల్లవిని సంప్రదించారు. కానీ సాయి పల్లవి అందుకు అంగీకరించలేదు. కారణాలు ఏమైనప్పటికీ సాయి పల్లవి చిరంజీవి చెల్లెలుగా నటించడానికి ఒప్పుకోలేదు. ఈ విషయాన్నే సాయి పల్లవి అభిమానులు ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు.
చిరంజీవి లాంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ వస్తే ఎవరైనా సరే ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తన క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ సరిగా లేదని ఆ సినిమా ఒప్పుకోలేదని ఆమె అభిమానులు అంటున్నారు. సినిమాల సంఖ్య పెంచుకోవడం కోసం, అలాగే డబ్బులు కోసమో సాయి పల్లవి సినిమా ఒప్పుకోదని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. అందుకే సంవత్సరం నుంచి ఎటువంటి సినిమా కూడా సాయి పల్లవి నుంచి రాలేదని గుర్తు చేస్తున్నారు. సాయి పల్లవి గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన డియర్ కామ్రేడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని కూడా ఆమె అభిమానులు ప్రస్తావిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం ఒక కొత్త మూవీ లో నటిస్తుంది.