పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాల జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం ‘జీ తెలుగు వారి జాతర’ పేరుతో సందడి చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో కమెడియన్ రియాజ్ భార్య కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబై స్టేజ్పైకి వచ్చారు. ఈ ప్రోమోలో రియాజ్, తన భార్య పేరును రివీల్ చేశారు. తన భార్య పేరు ‘యాస్మిన్’ అని రియాజ్ అనగా.. కాదు, ‘యాస్మిన్ రియాజ్’ అని సద్దామ్ అనడంతో రియాజ్ సిగ్గుపడతారు. సద్దామ్, రియాజ్ ఇద్దరిలో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారని యాంకర్ శ్రీముఖి అడగగా.. మరో మాట లేకుండా రియాజే అని యాస్మిన్ అన్నారు. ఆ తర్వాత ఈ జంట దండలు మార్చుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రియాజ్, యాస్మిన్ల జంట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ షోలో హీరో దుల్కర్ సల్మాన్, సీతారామం సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం కాబోతున్న మృణాల్ ఠాకూర్ కనువిందు చేయనున్నారు. ఇక ఈ షోలో సీరియల్ ఆర్టిస్టులతో పాటు భానుశ్రీ, శివజ్యోతి, రోహిణి వంటి వాళ్ళు సందడి చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ఈ జాతర ప్రసారం కానుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.