ప్రముఖ నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. మాస్టర్ మరణ వార్త విని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా షాక్కు గురయ్యారు. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని తెలుస్తోంది. అయితే రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడైన శేఖర్ మాస్టర్ తన గురువును కడసారి చూసేందుకు వస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం రక్తపు విరేచనాలు కావడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూనే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. మాస్టర్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తెలుగు మూవీ ఇండస్ట్రీలో దాదాపు 1500 పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమాలతో ఆయనకు డ్యాన్స్ మాస్టర్గా మంచి పేరు వచ్చింది. వైవీఎస్ రూపొందించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ ‘దేవదాసు’ చిత్రాలకు రాకేష్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పాటు హీరో వేణు, నటి ప్రత్యూషలకు డ్యాన్స్లో టెక్నిక్స్ నేర్పించింది రాకేష్ మాస్టర్ కావడం విశేషం. టాలీవుడ్లో ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్లుగా చక్రం తిప్పుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం గమనార్హం. ఇక, కానరాని దూరాలకు వెళ్లిపోయిన రాకేష్ మాస్టర్ను కడసారిగా చూసేందుకు ఇండస్ట్రీ జనాలతో పాటు ప్రేక్షకులు, ఫ్యాన్స్ భారీగా వస్తారని అంటున్నారు. అయితే మాస్టర్ ప్రియ శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాకేష్ మాస్టర్ చనిపోయాక అంతా శేఖర్ మాస్టర్ వస్తారని అనుకుంటున్నారు. వాళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అయితే మధ్యలో ఇద్దరికీ చెడిన విషయం తెలిసిందే. కానీ మనిషి పోయాక అయినా వస్తారని అందరూ అనుకుంటున్నారు. మరి.. శేఖర్ మాస్టర్ వస్తారా? ఆయనకు అసలు రాకేష్ మాస్టర్ మరణ వార్త తెలుసో లేదో చూడాలి.