యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలతో అలరించలేకపోయాడు. ఇప్పటికే సాహో- రాధేశ్యామ్ సినిమాలను నిర్మించినప్పటికీ.. ఆ స్థాయి ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయాడు. తర్వాత ప్రభాస్ నుంచి వరుస సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, మారుతితో సినిమా కూడా ఉంది. అయితే ఆదిపురుష్ సినిమాపై మొదట్లో ఎంతో ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. కానీ, టైలర్ విడుదలైన తర్వాత ఆ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇంక ప్రాజెక్ట్-K మీద కూడా అంత అంచనాలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు.
మారుతితో సినిమా అంటే ఎక్కువ అంచనాలు ఉండవు. మరి.. పాన్ ఇండియా హీరో నుంచి ఒక అద్భుతమైన సినిమా ఎప్పుడు వస్తుంది? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా లిస్ట్లోకి ఓ స్టార్ డైరెక్టర్ పేరు చేరిందని తెలుస్తోంది. పేరుకి బాలీవుడ్ డైరెక్టర్ అయినా కూడా దేశవ్యాప్తంగా అతనికి మంచి గుర్తింపు ఉంది. పైగా మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి డైరెక్టర్ ప్రభాస్ కోసం కథ రెడీ చేశారని తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని. అయితే రాజ్ కుమార్ హిరానీతో సినిమా చేయడం నా డ్రీమ్ అని ప్రభాస్ కూడా గతంలోనే చెప్పాడు. అయితే ఆ డ్రీమ్ ఇప్పుడు పూర్తి కానుందనే వార్తలు సినిమా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ప్రభాస్కు ఒక్క ఇండియాలోనే కాదు.. జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే పాన్ వరల్డ్ హీరోని దృష్టిలో పెట్టుకుని రాజ్ కుమార్ హిరాని కథని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. రాజ్ కుమార్ హిరాని విషయానికి వస్తే.. మున్నా భాయ్ ఎంబీబీబీఎస్, 3 ఈడియట్స్, పీకే, సంజూ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాడు. అందుకే ఆయనకు మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అనే పేరు కూడా వచ్చింది. ఇటీవలి కాలంలో ఓ మాదిరి హిట్టు కొట్టి ప్రభాస్కు చాలాకాలం అయ్యింది. అందుకే రాజ్ కుమార్ హిరానితో సినిమా చేస్తే చాలా బావుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. అదే నిజమైతే అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.